politics

మహాత్మా బసవేశ్వరుడుకి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్

_విశ్వగురువు మహాత్మా బసవేశ్వరుడు

మనవార్తలు ,రామచంద్రాపురం:

12వ శతాబ్దంలో సమాజంలో కుల మత వర్ణ వ్యవస్థను రూపుమాపేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. విశ్వ గురు, మహాత్మా బసవేశ్వరుడి 889 వ జయంతిని పురస్కరించుకొని వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో బీరంగూడ కమాన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బీరంగూడ నుండి జహీరాబాద్ వరకు ఏర్పాటు చేసిన వాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ట్యాంక్ బండ్ పై బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు, బసవ భవన నిర్మాణానికి ఎకరా స్థలం 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు.

నేటి తరానికి బసవేశ్వరుడి బోధనలు అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు అడిగే జగదీశ్వర్ జిల్లా అధ్యక్షుడు సిద్దేశ్వర్ ప్రధాన కార్యదర్శి జయ ప్రకాష్ మరియు మధు శేఖర్ నర్సింలు బీరంగూడ అధ్యక్షుడు బస్వరాజ్ పటాన్చెరు అధ్యక్షుడు శివరాజ్ పాటిల్ ఇస్నాపూర్ అధ్యక్షుడు మర్రి మల్లేష్ అధ్యక్షుడు బిహెచ్ఎల్ అధ్యక్షుడు రాజేశ్వర్ మరియు తదితరులు వీరశైవ లింగాయత్ సభ్యులందరూ పాల్గొన్నారు.

 

.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago