ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి…
– కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
పటాన్ చెరు:
కరోనా కట్టడి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమంలో భాగంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సింఫనీ పార్క్ హోమ్స్ దగ్గర ఉన్న అకాడమిక్ హైట్స్ స్కూల్ లో కాలనీవాసులు తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన కోవిడ్ టీకా కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అమీన్ పూర్ ఎంపీపీ ఈర్ల దేవానంద్ ముదిరాజ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీకాపై ఉన్న అనవసర అపోహలు మాని ప్రజలంతా టీకా వేయించుకోవాలని తెలిపారు. టీకా వేయించుకునే సమయంలో ప్రజలంత మాస్కు దరించి, భౌతిక దూరం పాటించాలని అన్నారు. సింఫనీ పార్క్ హోమ్స్, ప్రణీత్ ప్రణవ్ హోమ్స్, ప్రణీత్ కౌంటీ, సిద్దార్థ హోమ్స్, నందన్ రతన్ ప్రైడ్, ప్రణీత్ గ్రీన్ ఫీల్డ్స్, గ్రీన్ మీడోస్ తదితర కాలనీల వాసులు టీకా వేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీరంగుడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ ఏనుగు తులసిరెడ్డి, నాయకులు ఈర్ల శ్రీకాంత్, జ్ఞానేశ్వర్, సింఫనీ పార్క్ హోమ్స్ ప్రెసిడెంట్ విజయ్ రాజ్, రాకేష్ రెడ్డి, రాహుల్, కార్తిక్, మణిపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…