ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి…
– కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
పటాన్ చెరు:
కరోనా కట్టడి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమంలో భాగంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సింఫనీ పార్క్ హోమ్స్ దగ్గర ఉన్న అకాడమిక్ హైట్స్ స్కూల్ లో కాలనీవాసులు తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన కోవిడ్ టీకా కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అమీన్ పూర్ ఎంపీపీ ఈర్ల దేవానంద్ ముదిరాజ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీకాపై ఉన్న అనవసర అపోహలు మాని ప్రజలంతా టీకా వేయించుకోవాలని తెలిపారు. టీకా వేయించుకునే సమయంలో ప్రజలంత మాస్కు దరించి, భౌతిక దూరం పాటించాలని అన్నారు. సింఫనీ పార్క్ హోమ్స్, ప్రణీత్ ప్రణవ్ హోమ్స్, ప్రణీత్ కౌంటీ, సిద్దార్థ హోమ్స్, నందన్ రతన్ ప్రైడ్, ప్రణీత్ గ్రీన్ ఫీల్డ్స్, గ్రీన్ మీడోస్ తదితర కాలనీల వాసులు టీకా వేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీరంగుడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ ఏనుగు తులసిరెడ్డి, నాయకులు ఈర్ల శ్రీకాంత్, జ్ఞానేశ్వర్, సింఫనీ పార్క్ హోమ్స్ ప్రెసిడెంట్ విజయ్ రాజ్, రాకేష్ రెడ్డి, రాహుల్, కార్తిక్, మణిపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…