Hyderabad

పోచారం హరితహారం లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

హరితహారం తో సకాలంలో వర్షాలు…

– పోచారం హరితహారం లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు:

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని, ఇందుకు నిదర్శనం ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు ప్రారంభం కావడమేనని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ అన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం లో భాగంగా శుక్రవారం పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో ఎక్సైజ్ శాఖ మరియు గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న నగరీకరణ, జనాభా మూలంగా రోజురోజుకి వాతావరణం లో సమతుల్యత లోపించడం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ద్వారా కోట్ల మొక్కలు నాటడం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసి ఏటా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో సామాజిక అడవులను పెంచుతున్నట్లు తెలిపారు.

అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. హరితహారం లో భాగంగా గ్రామంలో ఆరు వందల ఈత మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి గాయత్రి దేవి, గ్రామ సర్పంచ్ జగన్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, గ్రామ గౌడ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago