_ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో రామచంద్రపురం నుండి పటాన్చెరు వరకు భారీ ఫ్రీడం రన్
_స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా చేపడుతున్న ది సప్తహ కార్యక్రమాల్లో భాగంగా గురువారం పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రాపురం నుండి పటాన్ చెరు వరకు భారీ ఫ్రీడం రన్ నిర్వహించారు.ప్రజా ప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, జిఎంఆర్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల విద్యార్థులు జాతీయ జెండాలు చేత బూని బోలో భారత్ మాతాకీ జై అంటూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ర్యాలీ సాగింది.గురువారం ఉదయం 8 గంటలకు రామచంద్రపురం డివిజన్ పరిధిలోని సంగీత థియేటర్ వద్ద ఎమ్మెల్యే జిఎంఆర్ జెండా ఊపి ఫ్రీడం రన్ ప్రారంభించారు. ఇక్రిసాట్ మీదుగా పటాన్ చెరు పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ 75 ఏళ్ల వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు వారాలపాటు నియోజకవర్గంలో వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా కార్యక్రమాలను రూపొందించామని తెలిపారు. సంబంధ వర్గాలను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి , డీఎస్పీ భీమ్ రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి ప్రసాద్, తహసిల్దార్లు శివకుమార్, మహిపాల్ రెడ్డి, ఎంపీడీవోలు మల్లేశ్వర్, బన్సీలాల్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, మండల విద్యాధికారులు రాథోడ్, జెమినీ కుమారి, సీఐ వేణుగోపాల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, పరమేష్, అఫ్జల్, పృథ్వీరాజ్, గోవింద్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…