politics

చదువుతొనే మీ భవిష్యత్తు. – రవి కుమార్ యాదవ్

మనవార్తలు శేరిలింగంపల్లి :

మియాపూర్ ,హైదర్ నగర్, శంశి గూడ, ఎల్లమ్మ బండ , వెంకటేశ్వర నగర్ ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ కే వై ఫౌండేషన్ ద్వారా ఉచిత స్టడీమెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని, విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర బిజెపి నాయకులు ఆర్ కే వై ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవి కుమార్ యాదవ్ పదవ తరగతి చదువుకునే విద్యార్థులకు తన సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ కే వై సభ్యుల చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమంలో రవి కుమార్ యాదవ్ ముందుండి నిరుపేద విద్యార్థులకు సహకారం అందించడం అభినందించ వలసిన విషయం అని పేర్కొన్నారు.

అంతేకాకుండా ఈ స్టడీ మెటీరియల్ ద్వారా విద్యార్థినీ, విద్యార్థులు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఆర్ కే వై పౌండేషన్ ద్వారా ప్రథమ, ద్వితీయ ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు, సీతారామరాజు, నర్సింగ్ యాదవ్, లక్ష్మారెడ్డి,శ్రీహరి యాదవ్,నర్సింగ్ రావు , శ్రీధర్ గౌడ్ ,పృథ్వి, తోట్ల భరత్, గణేష్ ముదిరాజ్, ఆంజనేయులు, వినోద్ యాదవ్,జె శ్రీను,రాము,రాఘవేంద్ర,యాది, గోవర్ధన్ చారి, శివ,సాయి తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago