మనవార్తలు శేరిలింగంపల్లి :
మియాపూర్ ,హైదర్ నగర్, శంశి గూడ, ఎల్లమ్మ బండ , వెంకటేశ్వర నగర్ ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ కే వై ఫౌండేషన్ ద్వారా ఉచిత స్టడీమెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని, విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర బిజెపి నాయకులు ఆర్ కే వై ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవి కుమార్ యాదవ్ పదవ తరగతి చదువుకునే విద్యార్థులకు తన సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ కే వై సభ్యుల చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమంలో రవి కుమార్ యాదవ్ ముందుండి నిరుపేద విద్యార్థులకు సహకారం అందించడం అభినందించ వలసిన విషయం అని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఈ స్టడీ మెటీరియల్ ద్వారా విద్యార్థినీ, విద్యార్థులు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఆర్ కే వై పౌండేషన్ ద్వారా ప్రథమ, ద్వితీయ ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు, సీతారామరాజు, నర్సింగ్ యాదవ్, లక్ష్మారెడ్డి,శ్రీహరి యాదవ్,నర్సింగ్ రావు , శ్రీధర్ గౌడ్ ,పృథ్వి, తోట్ల భరత్, గణేష్ ముదిరాజ్, ఆంజనేయులు, వినోద్ యాదవ్,జె శ్రీను,రాము,రాఘవేంద్ర,యాది, గోవర్ధన్ చారి, శివ,సాయి తదితరులు పాల్గొన్నారు
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…