పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ నీటి దినోత్సవాన్ని’ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ‘శ్రేయస్సు, శాంతి కోసం జలం అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.ఉమాదేవి మాట్లాడుతూ, జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పుల వంటి పెరుగుతున్న సవాళ్ల నేపథ్యంలో నీటి సంరక్షణ ప్రాముఖ్యత పెరిగిందన్నారు. నీటి కొరతను పరిష్కరించడానికి అందరికీ స్వచ్ఛమైన నీటిని అందించడానికి సనుష్టి కృషి అవసరమని ఆమె నొక్కి చెప్పారు. సానురస్యాన్ని పెంపొందించడంలో, శ్రేయస్సును సృష్టించడంలో, భాగస్వామ్యు సవాళ్లకు స్థితిస్థాపకతను పెంపొందించడంలో నీటి పాత్ర అమూల్యమైనదన్నారు.
రుద్రారం ఉన్నత పాఠశాలలో అవగాహనా కార్యక్రమం:
రసాయన శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టీ.బీ. పాత్రుడు, తోటి ఆధ్యాపకులు, బీఎస్సీ విద్యార్థులతో కలిసి డాక్టర్ ఉమ రుద్రారం ఉన్నత పాఠశాలలో నీటి సంరక్షణ ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. నీటి వనరులను కాపాడుకోవడంలో తను నిబద్ధతను ప్రదర్శించేలా విద్యార్థులు, అధ్యాపకులు నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు రేకెత్తించి, నీటి సంరక్షణపై మరింత అవగాహన కల్పించేందుకు గోడ పత్రిక రూపకల్పన పోటీలు, ముఖానికి రంగులు వేసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. విజేతల ప్రతిభను గుర్తించడంతో పాటు నీటి సంరక్షణ కార్యక్రమాలలో వారంతా చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు గాను బహుమతులు, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.సుస్థిరమైన నీటి నిర్వహణ, అందరికీ స్వచ్ఛమైన నీటిని అందించే దిశగా పనిచేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం ముగిసింది.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…