Telangana

గీతమ్ లో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (జీఎస్ పీ), హైదరాబాద్ బుధవారం ‘ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని” నిర్వహించారు. ‘పరిశుభ్రమైన నోటి ఆరోగ్యకరమైన దేహం’ అనే ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమంలో రూట్ కెనాల్, ఫేషియల్ ట్రామా కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రాము నోముల ముఖ్య అతిథిగా హాజరై సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నోటి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.నోటి ఆరోగ్యం, దైహిక ఆరోగ్య సమస్యల మధ్య సంబంధాన్ని డాక్టర్ రాము ప్రస్తావిస్తూ, నోటి నుంచి బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి శరీరంలోనిఇతర భాగాలపై ప్రభావం చూపుతుందన్నారు, పళ్ల మధ్య ఖాళీలు, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసన వంటి సాధారణ దంత సమస్యలన నివారించడంలో క్రమబద్ధంగా బ్రెష్ చేసుకోవడం, ఫ్లాసింగ్ వంటి మంచి నోటి పరిశుభ్రత పద్ధతులను ఆయన వివరించారు.

ఆత్మీయ అతిథిగా పాల్గొన్న కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ కె. మౌనిక మాట్లాడుతూ, సరైన జీర్ణక్రియ, ఆత్మగౌరవం, ఇరుగు పొరుగుతో సులువుగా కలవడం వంటి వాటి కోసం నోటిని ఆరోగ్యకరంగా ఉంచుకోవడం ఎంతో అవసరమన్నారు. రోజుకు రెండుసార్లు మెత్తటి బ్రెష్ పళ్లు తోమడం, నాలుకను ప్రతిరోజూ శుభ్రం చేయడం, చక్కెరను పరిమితంగా తీసుకోవడం, దంత వెద్యుడిని క్రమం తప్పకుండా సందర్శించడం, మరెన్నో నోటి పరిశుభ్రత పద్ధతులను ఆమె వివరించారు.గీతం స్టూడెంట్ లైఫ్ , గీతం ఫార్మసీ స్టూడెంట్ అసోసియేషన్ (జీపీఎస్ఏ) సహకారంతో నిర్వహించిన నోటి ఆరోగ్య అవగాహన శిబిరంలో అతిథులు ఇద్దరూ పాల్గొని, తగు సూచనలు చేశారు. తొలుత, గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. శివకుమార్ అతిథులను స్వాగతించి, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పవన్ కుమార్ చింతమనేని ఈ కార్యక్రమాలను సమన్వయం చేశారు.నోటి ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత, సాధారణ ఆరోగ్యానికి దానికి ఉన్న సంబంధం గురించిన అవగాహన, పెంపొందించడానికి ప్రతియేటా మార్చి 20న ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. నోటి పరిశుభ్రత పద్ధతులను ప్రోత్సహించడంపై దృష్టి పెడతారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

3 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

3 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

3 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

3 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

3 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago