Telangana

వాతవరణ మార్పు ఎన్నికల ప్రచారాంశం కావాలి

_గీతం అతిథ్య ఉసన్యాసంలో అభిలషించిన ఐఐటీ బొంబాయి ప్రొఫెసర్ డి.పార్థసారథి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల వల్ల ప్రకృతిలో ప్రమాదకరమైన మార్పులు సంభవిస్తున్నాయని, అది ఎన్నికల ప్రచారాంశం కావాలని ఐఐటీ బొంబాయిలోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ప్రొఫెసర్ డి.పార్థసారథి అభిలషించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ లోని సోషియాలజీ విభాగం ఆధ్వర్యంలో వాతావరణ మార్పులు, ప్రజా సమూహాలు, ఎన్నికలు’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను, కష్టాలను ఎన్నికల సమస్యగా సాధారణ ప్రజలు ఎందుకు లేవనెత్తడం లేదో అర్థం చేసుకోవడానికి ఈ చర్చ కొనసాగించారు.యువతలో వాతావరణంపై అవగాహనను పెంచే సందర్భంలో వాతావరణ న్యాయం యొక్క అర్థం, ఆవశ్యకతపై డాక్టర్ పార్థసారథి అవగాహన కల్పించారు.

ప్రపంచ సహకారం, ప్రాంతీయ ఒప్పందాలు, స్థానిక క్రియాశీలతను ప్రోత్సహించడంపై దృష్టి సారించే కొత్త విధానాన్ని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం నిపుణుల చర్చలు, శాస్త్రీయ చర్చలకు పరిమితమైన రోజువారీ సంభాషణలలో వాతావరణ మార్పులను భాగం చేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.తొలుత, జీఎస్ఏహెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోప్మాన్ జోస్ అతిథిని ఆహ్వానించి, సత్కరించారు. సోషియాలజీ విభాగం సమన్వయకర్త డాక్టర్ అవినాష్ అతిథి స్వాగతించగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రోమా భట్టాచార్య నందన సమర్పణ చేశారు.సామాజిక, పర్యావరణ సమస్యలను ఎత్తిచూపి, సానుకూల సూర్పును తీసుకురావడానికి నిపుణులను ఒకచోట చేర్చి, ఆయా అంశాలపై చర్చలను జీఎస్ హెచ్ఎస్ నిర్వహిస్తోంది.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago