Telangana

వ్యాపార నిర్ణయంలో ఏఐ&ఎంఎల్ వినియోగంపై కార్యశాల

గీతంలో మే 25 నుంచి 29 వరకు,

ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ‘వ్యాపార నిర్ణయం తీసుకోవడం కోసం కృత్రిమ మేధస్సు & యంత్ర అభ్యాసం’పై మే నెల 25 నుంచి 29వ తేదీ వరకు, ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు ఐదు రోజుల ఆన్ లైన్ ఆచారణాత్మక కార్యశాల (యాజమాన్య వికాస కార్యక్రమం – ఎండీపీ)ను నిర్వహిస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఆధునిక వ్యాపార నిర్ణయం తీసుకోవడంలో కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) యొక్క పెరుగుతున్న ప్రాధాన్యాన్ని సదస్యులకు పరిచయం చేయడం ఈ కార్యక్రమ లక్షమని తెలిపారు. ఏఐ-ఆధారిత విశ్లేషణలు వినియోగదారులను ఆకట్టుకోవడం, డిమాండ్ అంచనా, నష్ట అంచనా, ఆయా సంస్థలకు అనుగుణంగా మార్కెటింగ్ వంటి రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్నందున, డేటా-ఆధారిత నిర్ణయాల కోసం ఈ సాంకేతికతలను వినియోగించడానికి ఆచరణాత్మక అంతర్దృష్టులతో ఈ శిక్షణలో పాల్గొనేవారిని సన్నద్ధం చేయడానికి ప్రయత్నిస్తామని వివరించారు.ప్రధానంగా నిర్వహణ, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, కంప్యూటర్ అప్లికేషన్లు, ఇంజనీరింగ్ విభాగాల నుంచి అధ్యాపకుల కోసం రూపొందించినట్టు తెలియజేశారు.

ఎంఎల్ ను పూర్తిగా సాంకేతిక అంశంగా పరిగణించడం కంటే వ్యాపార-ఆధారిత వినియోగ కేసులు, ఆచరణాత్మక ప్రదర్శనలు, నమూనా ఉత్పత్తి వివరణపై కార్యశాల దృష్టి పెడుతుందన్నారు. ఇందులో పాల్గొనేవారికి ఏఐ, ఎంఎల్ భావనలను అందుబాటులో ఉంచడానికి ఆచరణాత్మక డేటాసెట్లు, విజువలైజేషన్ ఆధారిత వివరణలు, ఉపయోగించడానికి సులభమైన విశ్లేషణ అంతర్ముఖంగా ఉపయోగిస్తామని తెలిపారు.బిజినెస్ అనలిటిక్స్, డేటాసైన్స్, ఏఐ-ఎంఎల్ అప్లికేషన్లలో విస్తృత అనుభవం ఉన్న విద్యావేత్త, పరిశోధకుడు డాక్టర్ ఎం.కామాక్షయ్య ప్రధాన శిక్షకుడిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పర్యవేక్షించిన, పర్యవేక్షించని అభ్యాసం, సిఫారసుదారు వ్యవస్థలు, సమిష్టి నమూనాలు వంటి కీలక అంశాలను వివరిస్తుందని తెలిపారు.

ప్రతి సాంకేతికతను వినియోగదారుల అంచనా, మార్కెట్ విభజన, ఉత్పత్తి సిఫార్సు, మోసం గుర్తింపుతో సహా వాస్తవ-ప్రపంచ నిర్వాహక ప్రశ్నలను అనుసంధానిస్తుందని వివరించారు.ఈ కార్యశాల పూర్తయ్యేసరికి, ఇందులో పాల్గొనేవారు విషయ పరిజ్జానంపై అవగాహనతో పాటు ఏఐ-ఎంఎల్ పద్ధతులను ఆచరణాత్మకంగా తెలుసుకుంటారని తెలిపారు. ఈ పద్ధతులను వ్యాపార నిర్ణయ సమస్యలకు వర్తింపజేయడానికి, ఏఐ-ఆధారిత అధ్యయనాలు (కేస్ స్టడీస్), విద్యార్థి ప్రాజెక్టులను రూపొందించడానికి వీలు కల్పిస్తుందన్నారు.ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు, తమ పేర్ల నమోదు, రుసుము, ఇతరత్రా వివరాల కోసం jpaul@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని లేదా డాక్టర్ జోసెఫ్ పాల్ ను సంప్రదించాలని సూచించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago