Telangana

గీతమ్లో ద్రవాల భౌతికశాస్త్రంపే కార్యశాల…. పేర్ల నమోదుకు చివరి తేదీ : ఈనెల 25

మనవార్తలు ,పటాన్ చెరు:

గీతం హెదరాబాద్ ప్రాంగణంలోని గణిత శాస్త్ర విభాగం ఈనెల 28-30 తేదీలలో ‘ ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ : మెథడ్స్ అండ్ అప్లికేషన్స్ ‘ ( ద్రవాల భౌతికశాస్త్రం : పద్ధతులు , వినియోగం ) అనే అంశంపై మూడురోజుల కార్యశాలను నిర్వహించనుంది . ఈ విషయాన్ని కార్యశాల నిర్వాహకులు ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్ , డాక్టర్ మోతహర్ రెజాలు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ద్రవ గతిశాస్త్రం ప్రాథమిక మోడలింగ్ అంశాలు , హోమోటోపీ పెర్ టర్బేషన్ మెథడ్ ( హెచ్పీఎం ) , ఎల్డీఎం , ఎఫ్పీఎం వంటి విశ్లేషణాత్మక , సంఖ్యా పనులు , ద్రవ ప్రవాహంలో కనిపించే నాన్తీనియర్ అవకలన సమీకరణాలను పరిష్కరించడానికి వర్ణపట పద్ధతులను పరిచయం చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యశాల నిర్వహిస్తున్నామన్నారు . సమస్యలను పరిష్కరించడం , మ్యాథమెటికా లేదా మ్యాట్లాబ్లో న్యూమరికల్ టెక్నిక్లపై పనిచేయడంపై కూడా శిక్షణ ఇస్తామని తెలిపారు .

వివిధ వ్యవస్థలలో ద్రవ రవాణా మోడలింగ్ అంశాలు , ఇంటర్ఫేస్ పరిస్థితుల భౌతికశాస్త్రం , సరిహద్దు పొర సిద్ధాంతం , సారూప్యత పరిష్కారాలు , మెక్రోఫిజిక్స్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ వంటి ప్రధాన అంశాలు ఈ వర్క్షాప్లో ఉంటాయన్నారు . ఐఐటీ ఖరగ్ పూర్ లోని గణిత శాస్త్ర విభాగం ప్రొఫెసర్ జీ.పీ.రాజశేఖర్ , ఐఐటీ హైదరాబాద్లోని రసాయన సాంకేతిక విభాగం ప్రొఫెసర్ కీర్తి చంద్ర సాహు , ఇతర నిపుణులు ఈ కార్యశాలలో ప్రధాన వక్తలుగా పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు .

ఫ్లూయిడ్ డెన్హమిక్స్ పనిచేస్తున్న విద్యావేత్తలు , పరిశోధక విద్యార్థులు , పీజీ విద్యార్థులు కోసం ఈ వర్క్షాప్ను ఉద్దేశించామని , ఆసక్తి గలవారు ఈనెల 25 వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు . ఇతర వివరాల కోసం డాక్టర్ జె.విజయశేఖర్ ( 97 00668875 ) / డాక్టర్ నార్ల వంశీకృష్ణ ( 80744 02 980 ) లను సంప్రదించాలని , లేదా vnarla@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని నిర్వాహకులు సలహా ఇచ్చారు

admin

Recent Posts

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

5 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

5 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

5 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

5 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

1 day ago

ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…

1 day ago