Telangana

గీతమ్ లో ‘రేపటి ఆవిష్కర్తలను రూపొందించడం’పై వర్క్ షాప్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘రేపటి ఆవిష్కర్తలను రూపొందించడం: మెకానికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్/కృత్రిమ మేథ పాఠ్యాంశాల’పై రెండు రోజల కార్యశాలను నిర్వహించారు. ప్రస్తుత మార్కెట్, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించడం, మెకానికల్ ఇంజనీరింగ్ నెపుణ్యం-ఆధారిత విద్యను రూపొందించడం లక్ష్యంగా దీనిని నిర్వహించినట్టు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి మార్గదర్శకత్వంలో, ప్రఖ్యాత పరిశోధనా సంస్థల నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొన్నట్టు తెలియజేశారు. సూరత్కల్లోని ఎన్ఐటీకే నుంచి ప్రొఫెసర్ ఎస్.ఎం. మురుగేంద్రప్ప, ఐఐటీ హెదరాబాద్ నుంచి ప్రొఫెసర్ ఆర్.ప్రశాంత కుమార్, వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ వి.వాసు తదితరులు పాల్గొని తమ విలువెన అవగాహనను పంచుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, కృత్రిమ మేథ, వినూత్న విధానాల అన్వేషణకు ఈ కార్యశాల ఒక వేదికగా ఉపయోగపడిందన్నారు. విద్యా ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించడంలో వారు చురుకుగా పాల్గొని, పరిశ్రమ డిమాండుకు తగ్గట్టు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో తోడ్పాటును అందించినట్టు తెలిపారు. గీతం మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యాపకులు కూడా ఈ కార్యశాలలో చురుకుగా పాల్గొని, ప్రతిపాదిత పాఠ్యాంశాలను మెరుగుపరచడానికి వారి అభిప్రాయాలు, తగు సూచనలను అందించినట్టు డాక్టర్ శ్రీనివాస్ వివరించారు. పరిశ్రమ అవసరాలను ప్రతిబింబించేలా, విద్యార్థులకు సమగ్రమెన్ష, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేలా పాఠ్యాంశాలను రూపొందించడంలో వారు కీలక భూమిక పోషించినట్టు తెలిపారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago