పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ , హైదరాబాద్ ( జీఎస్బీ ) ; నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ( ఎన్ఎస్ఈ ) అకాడమీలు సంయుక్తంగా ఈనెల 26-27 తేదీలలో ‘ ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అండ్ కంప్యూటేషనల్ ఫెన్షన్స్ యూజింగ్ పెథాన్ అండ్ ఆర్ ‘ రెండు రోజుల వర్చువల్ వర్క్షాపు నిర్వహించనున్నాయి . ఈ విషయాన్ని జీఎస్బీ ఫైనాన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్ . రాధిక మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . సెక్యూరిటీ మార్కెట్లలో పార్టిసిపెంట్ల నెపుణ్యాలు , సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ఈ వర్క్షాప్ లక్ష్యమన్నారు . ఇందులో పాల్గొనే వారందరికీ అల్గారిథమిక్ ట్రేడింగ్ను పరిచయం చేయడంతో పాటు , వారిని నిజ – సమయ వ్యూహాలతో సన్నద్ధం చేయనున్నట్టు ఆమె వివరించారు . సిగ్నస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో ఎం . అరవింద్ , క్యాపిటల్ మార్కెట్లోని ఎస్ఎంఈ ఎల్.కన్నన్ , గీతం అధ్యాపకులు తమ విస్తృతమైన ట్రేడింగ్ అనుభవంతో ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు . ఆసక్తి గలవారు తమ పేర్ల నమోదు కోసం ఈనెల 24 వ తేదీలోగా డాక్టర్ ఎన్ . రూపలత 98481 17823 ని సంప్రదించాలని లేదా finghbsws21@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని ప్రొఫెసర్ రాధిక సూచించారు .
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…