మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ స్మశాన వాటిక పునరుద్ధరణ పనులను వర్షాకాలానికి ముందే అత్యవసరంగా చేపట్టాలని కోరుతూ డివిజన్ నాయకులు ఆంజనేయులు సాగర్ సిఎంసి కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సిఎంసి అడిషనల్ కమిషనర్ గీతా రాధిక ను కలిసి వినతిపత్రం అందజేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం స్మశాన వాటికలో ప్రజలు కర్మకాండలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఆయన వివరించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని కోరారు.ఈ విషయంపై స్పందించిన అడిషనల్ కమిషనర్ గీతా రాధిక టెండర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి పనులు త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపాడు.ఈ కార్యక్రమంలో అంజయ్య నగర్ కాలనీ అధ్యక్షులు నరసింహ సాగర్, జి రవి సాగర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…