Telangana

వర్షాకాలానికి ముందే అంజయ్య నగర్ స్మశాన వాటిక పనులు పూర్తి చేయాలి – ఆంజనేయులు సాగర్

మనవార్తలు ప్రతినిధి ,  శేరిలింగంపల్లి :

అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ స్మశాన వాటిక పునరుద్ధరణ పనులను వర్షాకాలానికి ముందే అత్యవసరంగా చేపట్టాలని కోరుతూ డివిజన్ నాయకులు ఆంజనేయులు సాగర్ సిఎంసి కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సిఎంసి అడిషనల్ కమిషనర్‌ గీతా రాధిక ను కలిసి వినతిపత్రం అందజేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం స్మశాన వాటికలో ప్రజలు కర్మకాండలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఆయన వివరించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని కోరారు.ఈ విషయంపై స్పందించిన అడిషనల్ కమిషనర్ గీతా రాధిక టెండర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి పనులు త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపాడు.ఈ కార్యక్రమంలో అంజయ్య నగర్ కాలనీ అధ్యక్షులు నరసింహ సాగర్, జి రవి సాగర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago