Telangana

కార్మికుల కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.26వేలకు పెంచాలి

ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలకు శాస్త్రీయత ఎక్కడ..?

72 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల ఊసేది

సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

కార్మికుల కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ. 26వేలకు పెంచాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కనీస వేతనాలకు శాస్త్రీయ బద్ధంగా లేదని, 72 షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల కనీస వేతనాల ఊసే లేదని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శనివారం పాశమైలారం ఇండస్ట్రియల్ కస్టర్ సీఐటీయూ కార్యకర్తల సమావేశంలో మానిక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కార్మికుల కనీస వేతనాల్లో శాస్త్రీయత ఎక్కడుందని నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కనీస వేతనాలు మాత్రం శాస్త్రీయంగా పెంచలేదన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన ఆర్భాటం తప్ప ఏమీ లేదని, కనీస వేతనాల జీవోలలో ఉన్న కనీస వేతనాల కంటే తగ్గించి ప్రకటించారని విమర్శించారు. డాక్టర్ ఆక్రాయిడ్ మరియు అనేకమంది శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం కనీస వేతనాలు రూ. 32000 ఉండాలని, కానీ సిఐటియు ట్రేడ్ యూనియన్లు 26000 పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త, రాష్ట్రవ్యాప్త సమ్మెలు, ఆందోళనలు, పోరాటాలు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. కానీ వీటికి భిన్నంగా ముఖ్యమంత్రి కనీస వేతనాలను ప్రకటించడం దారుణమని, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలను తక్షణమే సవరిస్తూ రూ.26వేలకు పెంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు, క్లస్టర్ నాయకులు వెంకటేష్, కిరణ్, సంపత్ రెడ్డి, శ్రీనివాస్, దుర్గయ్య, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago