ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలకు శాస్త్రీయత ఎక్కడ..?
72 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల ఊసేది
సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
కార్మికుల కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ. 26వేలకు పెంచాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కనీస వేతనాలకు శాస్త్రీయ బద్ధంగా లేదని, 72 షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల కనీస వేతనాల ఊసే లేదని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శనివారం పాశమైలారం ఇండస్ట్రియల్ కస్టర్ సీఐటీయూ కార్యకర్తల సమావేశంలో మానిక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కార్మికుల కనీస వేతనాల్లో శాస్త్రీయత ఎక్కడుందని నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కనీస వేతనాలు మాత్రం శాస్త్రీయంగా పెంచలేదన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన ఆర్భాటం తప్ప ఏమీ లేదని, కనీస వేతనాల జీవోలలో ఉన్న కనీస వేతనాల కంటే తగ్గించి ప్రకటించారని విమర్శించారు. డాక్టర్ ఆక్రాయిడ్ మరియు అనేకమంది శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం కనీస వేతనాలు రూ. 32000 ఉండాలని, కానీ సిఐటియు ట్రేడ్ యూనియన్లు 26000 పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త, రాష్ట్రవ్యాప్త సమ్మెలు, ఆందోళనలు, పోరాటాలు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. కానీ వీటికి భిన్నంగా ముఖ్యమంత్రి కనీస వేతనాలను ప్రకటించడం దారుణమని, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలను తక్షణమే సవరిస్తూ రూ.26వేలకు పెంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు, క్లస్టర్ నాయకులు వెంకటేష్, కిరణ్, సంపత్ రెడ్డి, శ్రీనివాస్, దుర్గయ్య, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…