Telangana

కార్మికుల కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.26వేలకు పెంచాలి

ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలకు శాస్త్రీయత ఎక్కడ..?

72 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల ఊసేది

సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

కార్మికుల కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ. 26వేలకు పెంచాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కనీస వేతనాలకు శాస్త్రీయ బద్ధంగా లేదని, 72 షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల కనీస వేతనాల ఊసే లేదని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శనివారం పాశమైలారం ఇండస్ట్రియల్ కస్టర్ సీఐటీయూ కార్యకర్తల సమావేశంలో మానిక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కార్మికుల కనీస వేతనాల్లో శాస్త్రీయత ఎక్కడుందని నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కనీస వేతనాలు మాత్రం శాస్త్రీయంగా పెంచలేదన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన ఆర్భాటం తప్ప ఏమీ లేదని, కనీస వేతనాల జీవోలలో ఉన్న కనీస వేతనాల కంటే తగ్గించి ప్రకటించారని విమర్శించారు. డాక్టర్ ఆక్రాయిడ్ మరియు అనేకమంది శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం కనీస వేతనాలు రూ. 32000 ఉండాలని, కానీ సిఐటియు ట్రేడ్ యూనియన్లు 26000 పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త, రాష్ట్రవ్యాప్త సమ్మెలు, ఆందోళనలు, పోరాటాలు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. కానీ వీటికి భిన్నంగా ముఖ్యమంత్రి కనీస వేతనాలను ప్రకటించడం దారుణమని, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలను తక్షణమే సవరిస్తూ రూ.26వేలకు పెంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు, క్లస్టర్ నాయకులు వెంకటేష్, కిరణ్, సంపత్ రెడ్డి, శ్రీనివాస్, దుర్గయ్య, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago