Hyderabad

ప్రజలకు జవాబుదారీగా పని చేయండి_ ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ఆయా శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతి, చేపట్టబోయే కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.

జాతీయ రహదారిపై గల విద్యుత్ స్తంభాల నిర్వహణ సరిగా లేదని, వెంటనే సంబంధిత సిబ్బందితో చర్చించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మూడు డివిజన్ల పరిధిలో పాత విద్యుత్ స్తంభాలు తొలగించాలని ఆదేశించిన, అధికారులు సత్వరమే స్పందించడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పాత విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన విద్యుత్ స్తంభాలు అమర్చాలని అధికారులకు సూచించారు. కొన్ని శాఖల్లో ఫీల్డ్ స్థాయి సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం మూలంగా స్థానిక ప్రజాప్రతినిధులకు చెడ్డపేరు వస్తుందని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

మిషన్ భగీరథ ద్వారా బండ్లగూడ పరిధిలో పలు కాలనీలకు మంచి నీరు రావడం లేదని కార్పొరేటర్ కుమార్ యాదవ్ అధికారుల దృష్టికి తీసుకొని వచ్చారు. మూడు డివిజన్ల పరిధిలో పెరిగిన జనాభాకు అనుగుణంగా శానిటేషన్ సిబ్బందినీ పెంచాలని జోనల్ కమిషనర్ రవికిషోర్ కు సూచించారు. ఉదయం 5 గంటల లోపు కింది స్థాయి సిబ్బంది నుండి జోనల్ స్థాయి వరకు గల అధికారులందరూ వార్డుల్లో పర్యటిస్తే సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు త్వరితగతిన పరిష్కరించవచ్చని అన్నారు.

 

ఉన్నత స్థాయి అధికారులు నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేస్తే సిబ్బందిలో జవాబుదారితనం పెరుగుతుందని అన్నారు. ఇక నుండి ప్రతి ఆరు నెలలకొకసారి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పటాన్చెరు, రామచంద్రపురం డివిజన్ల పరిధిలో నిర్మానుష్య ప్రాంతాలు గంజాయి పీల్చే వారికి అడ్డాలుగా మారుతున్నాయని, అమాయక విద్యార్థులు , యువత వీటి బారినపడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఎక్సైజ్, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి, గంజాయి విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, విద్యార్థులకు కౌన్సిలింగ్ చేయాలని సూచించారు. ఇక నుండి సమీక్ష సమావేశాలకు హాజరయ్యే అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమిషనర్ బాలయ్య, రెవెన్యూ, విద్యుత్, నీటిపారుదల, హెచ్ ఎం డబ్ల్యు ఎస్, హెచ్ఎండీఏ, ఎక్సైజ్, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago