Hyderabad

ప్రజలకు జవాబుదారీగా పని చేయండి_ ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ఆయా శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతి, చేపట్టబోయే కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.

జాతీయ రహదారిపై గల విద్యుత్ స్తంభాల నిర్వహణ సరిగా లేదని, వెంటనే సంబంధిత సిబ్బందితో చర్చించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మూడు డివిజన్ల పరిధిలో పాత విద్యుత్ స్తంభాలు తొలగించాలని ఆదేశించిన, అధికారులు సత్వరమే స్పందించడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పాత విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన విద్యుత్ స్తంభాలు అమర్చాలని అధికారులకు సూచించారు. కొన్ని శాఖల్లో ఫీల్డ్ స్థాయి సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం మూలంగా స్థానిక ప్రజాప్రతినిధులకు చెడ్డపేరు వస్తుందని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

మిషన్ భగీరథ ద్వారా బండ్లగూడ పరిధిలో పలు కాలనీలకు మంచి నీరు రావడం లేదని కార్పొరేటర్ కుమార్ యాదవ్ అధికారుల దృష్టికి తీసుకొని వచ్చారు. మూడు డివిజన్ల పరిధిలో పెరిగిన జనాభాకు అనుగుణంగా శానిటేషన్ సిబ్బందినీ పెంచాలని జోనల్ కమిషనర్ రవికిషోర్ కు సూచించారు. ఉదయం 5 గంటల లోపు కింది స్థాయి సిబ్బంది నుండి జోనల్ స్థాయి వరకు గల అధికారులందరూ వార్డుల్లో పర్యటిస్తే సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు త్వరితగతిన పరిష్కరించవచ్చని అన్నారు.

 

ఉన్నత స్థాయి అధికారులు నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేస్తే సిబ్బందిలో జవాబుదారితనం పెరుగుతుందని అన్నారు. ఇక నుండి ప్రతి ఆరు నెలలకొకసారి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పటాన్చెరు, రామచంద్రపురం డివిజన్ల పరిధిలో నిర్మానుష్య ప్రాంతాలు గంజాయి పీల్చే వారికి అడ్డాలుగా మారుతున్నాయని, అమాయక విద్యార్థులు , యువత వీటి బారినపడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఎక్సైజ్, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి, గంజాయి విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, విద్యార్థులకు కౌన్సిలింగ్ చేయాలని సూచించారు. ఇక నుండి సమీక్ష సమావేశాలకు హాజరయ్యే అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమిషనర్ బాలయ్య, రెవెన్యూ, విద్యుత్, నీటిపారుదల, హెచ్ ఎం డబ్ల్యు ఎస్, హెచ్ఎండీఏ, ఎక్సైజ్, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

2 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

2 weeks ago