మహిళల సంఘటిత శక్తిని బలోపేతం చేస్తున్న కార్పొరేటర్ సింధు ఆధర్శ్ రెడ్డి
రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి :
భారతి నగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీలో గల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మహిళా ఆర్యవైశ్య మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సమావేశం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆధర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళల ఐక్యతకు, సాధికారతకు బలమైన సందేశాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మహిళల నుంచి కొత్తగా మహిళా గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మహిళా గ్రూప్ ప్రతి నెల క్రమం తప్పకుండా సమావేశమై సామాజిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతో పాటు మహిళల అభివృద్ధి, హక్కుల సాధన, సమాజ సేవ లక్ష్యంగా పనిచేయనుందని స్పష్టం చేశారు. అనంతరం కార్పొరేటర్ సింధు ఆధర్శ్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు సంఘటితంగా ముందుకు వస్తే సమాజంలో ఎలాంటి మార్పునైనా సాధించగలరని పేర్కొన్నారు. మహిళల ఐక్యతే సామాజిక మార్పుకు పునాదని, మహిళల అభివృద్ధి లేకుండా సమాజ పురోగతి సాధ్యం కాదని స్పష్టంగా తెలిపారు. మహిళా శక్తిని ఎప్పుడూ ప్రోత్సహించే నాయకత్వంగా తమ వంతు సహకారం నిరంతరం ఉంటుందని భరోసా ఇస్తూ, కొత్తగా ఏర్పాటైన మహిళా గ్రూప్కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా ఆర్యవైశ్య మహిళా గ్రూప్ సభ్యులు ధ్యానేశ్వరి, శ్రీలతతో పాటు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…