మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కు చెందిన జేపీ నగర్, ఏమ్ఏ నగర్, టీఎన్ నగర్, చిరంజీవి నగర్, వీడియా కాలనీ, ఎస్ఆర్ ఎస్టేట్స్, ప్రగతి ఎన్క్లేవ్, మయూరి నగర్, బీకే ఎన్క్లేవ్ కాలనీలోని వివిధ రంగాల్లో సంగీతం, రాజకీయం, ఆశ వర్కర్స్, సామాజికసేవా, బాలగోకులం, ఫిట్నెస్ కోచెస్, సోషల్ మీడియా, ఐటీ శాఖ, కమ్యూనిటీ సర్వీస్, మరిన్ని విభాగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలకి అవార్డులను ప్రదానం చేసి శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ వారు చేసిన సేవ కార్యక్రమాలను ప్రశంసిస్తూ అభినందించారు.ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు మరెన్నో చేసి రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని కోరారు. మహిళాలకు ఏ అవసరం వచ్చినా అందరికీ అండగా తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యలమంచి ఉదయ్ కిరణ్ టీమ్ సభ్యులు రవి కుమార్, శరత్, వినోద్, వాసు, శ్రీరామ్, రాజేష్, మండూరి,కృష్ణ, వంశీ,సింహాచలం,గురువులు,ప్రవీణ్,నాగ సాయి,చారి,సాయి,అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…