మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ గోకుల్ ప్లాట్స్ లో శనివారం రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలుగు యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ వై ఆర్ శ్యామల మాట్లాడుతూ ”డబ్బున్న వారికి చదువు ఆభరణం- పేదవారికి చదువు ఆయుధం ”అంటూ ప్రతి పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకున్నప్పుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. మాతృభాష తెలుగును మర్చిపోరాదని చెబుతూ తెలుగులో చదువుకున్న వారెందరో చాలా ఉన్నత స్థాయికి వెళ్లారని, తెలిపారు. తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా గౌరవించి చదివించాలని పిలుపునిచ్చారు. హైదర్ నగర్ ప్రభుత్వ పాఠశాల అధ్యాపకురాలు జోషి అరుణశ్రీ మాట్లాడుతూ ప్రతి తల్లి తన బిడ్డల మీద అతి ప్రేమ చూపకుండా బాధ్యతాయుతంగా చదువుకునే విధంగా చూడాలని అన్నారు. ప్రతి పేద విద్యార్థి చదువుకుంటే భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవడానికి సాధ్యపడుతుందని కనుక క్రమం తప్పకుండా స్కూల్ కు వెళ్లాలని అన్నారు.
డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ నాయకులు చావా అరుణ, కళ్యాణి, పద్మావతి, గొర్రెపాటి వివేక్, జయలక్ష్మితోపాటు విద్యార్థులు,వారి తల్లులు మరియు కాలనీలో మహిళలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లీన్ ఫర్ గుడ్ సొసైటీ ముఖ్య అతిథిగా పాల్గొన్న వై. అర్. శ్యామల, అరుణశ్రీ లతో పాటు మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…