Telangana

గీతంలో విజయవంతంగా ముగిసిన ‘గస్టో’

విజేతలకు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాల ప్రదానం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని స్పోర్ట్స్ డైరెక్టరేట్ నిర్వహించిన అంతర్ విశ్వవిద్యాలయ వార్షిక క్రీడా ఉత్సవం, గస్టో 2025, క్రీడాతత్వం, సమష్టికృషి, అజేయమైన క్రీడా స్పూర్తితో విజయవంతంగా ముగిసింది. ఇది కేవలం ఒక క్రీడా పోటీలుగానే కాక, ఓర్పు, ఐక్యత, అవిశ్రాంతంగా రాణించాలనే తపనల పండుగగా సాగింది. ఉత్కంఠభరితమైన ప్రారంభ మ్యాచ్ నుంచి ఉత్సాహభరితమైన చివరి క్షణాల వరకు, టోర్నమెంట్ అద్భుతమైన విన్యాసాలు, ఉత్కంఠభరితంగా ఆటలను ప్రదర్శించడమే గాక, ఇందులో పాల్గొన్న వారందరిపై చెరగని ముద్ర వేసింది.గస్టో అంటే కేవలం గెలవడం, లేదా ఓడిపోవడం కాదని, ఇది పట్టుదల, స్నేహం, క్రీడల ద్వారా జీవితంలోని గొప్ప పాఠాలను నేర్చుకోవడంగా నిర్వాహకులు అభివర్ణించారు. జీవితంలోని ప్రతి రంగంలోనూ బృంద కృషి, అంకితభావం, క్రీడా స్ఫూర్తి యొక్క విలువలను ముందుకు తీసుకెళ్లాలని వారు అభిలషించారు. ఇది విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, బీటెక్ తొలి ఏడాది సమన్వయకర్త డాక్టర్ పి.త్రినాథరావు, క్రీడల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.నారాయణరావు చౌదరి, మేనేజర్ తపస్వి తదితరులు విజేతలకు క్రీడా ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.

బ్యాండ్మింటన్ (డబుల్స్) విజేత కేఎల్ యూ-హైదరాబాద్, రెండో స్థానం గీతం

బాస్కెట్ బాల్ (పురుషులు) విజేత మహీంద్రా విశ్వవిద్యాలయం, రెండో స్థానం గీతం

కబడ్డీ (మహిళలు) విజేత గీతం, రెండో స్థానం ఎంఆర్ సీఈటీ

కబడ్డీ (పురుషులు) విజేత ఎంఎల్ఆర్ఎటీ, రెండో స్థానం గీతం

టేబుల్ టెన్నిస్ (పురుషులు-సింగిల్స్) విజేత ఎం-సీఈటీ, రెండో స్థానం శ్రీనిధి

టేబుల్ టెన్నిస్ (పురుషులు-డబుల్స్) విజేత ఎం-సీఈటీ, రెండో స్థానం గీతం

టేబుల్ టెన్నిస్ (మహిళలు-సింగిల్స్) విజేత అవినాష్ కళాశాల, రెండో స్థానం కేఎస్ఆర్ యూహెచ్ఎస్

త్రోబాల్ విజేత గీతం, రెండో స్థానం మహీంద్రా విశ్వవిద్యాలయం

వాలీబాల్ విజేత ఎంఆర్ సీఈటీ, రెండో స్థానం గీతం

క్రికెట్ విజేత ఎస్ఆర్ సీఈటీ, రెండో స్థానం వీజేఐటీ

ఫుట్ బాల్ (పురుషులు) విజేత మహీంద్రా విశ్వవిద్యాలయం, రెండో స్థానం గీతం

ఈ కార్యక్రమాన్ని విద్యార్థిని ఓంకారిణి పాండే సమన్వయం చేశారు. గజ్జె – 2025ని మరపురాని అనుభవంగా మార్చడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. గస్టో 2026ను మరింత ఉన్నతంగా, సాటిలేని ఉత్సవంగా, క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించే సిసలైన వేదికగా నిలపాలని ఆమె అభిలషిస్తూ, ఈ వేడుకలను ముగించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago