మనవార్తలు ,పటాన్ చెరు
సంక్రాంతి పండుగ ముగ్గులతో మహిళలోని సృజనాత్మకత బయటపడుతుందని టిఆర్ఎస్ పటాన్ చెరు నియోజకవర్గం నాయకులు, పటాన్ చెరు మాజీ సర్పంచ్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్ అన్నారు. నియోజకవర్గ టిఆర్ఎస్ మైనారిటీ విభాగం నాయకులు మేరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో పటాన్ చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన దేవేందర్ రాజు ముదిరాజ్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఇది మొదటి పండుగని, పాత ఆలోచనలకు స్వస్తి పలికి కొత్త ఆలోచనలతో కొత్త మార్గంలో పయనించాలని సూచించారు. దక్షిణాయనం నుండి ఉత్తరాయణం ప్రారంభం కానుండడంతో కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ అని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన దేవేందర్ రాజు శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని దేవేందర్ రాజు ముదిరాజ్ తెలిపారు .
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…