మనవార్తలు ,పటాన్ చెరు
సంక్రాంతి పండుగ ముగ్గులతో మహిళలోని సృజనాత్మకత బయటపడుతుందని టిఆర్ఎస్ పటాన్ చెరు నియోజకవర్గం నాయకులు, పటాన్ చెరు మాజీ సర్పంచ్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్ అన్నారు. నియోజకవర్గ టిఆర్ఎస్ మైనారిటీ విభాగం నాయకులు మేరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో పటాన్ చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన దేవేందర్ రాజు ముదిరాజ్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఇది మొదటి పండుగని, పాత ఆలోచనలకు స్వస్తి పలికి కొత్త ఆలోచనలతో కొత్త మార్గంలో పయనించాలని సూచించారు. దక్షిణాయనం నుండి ఉత్తరాయణం ప్రారంభం కానుండడంతో కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ అని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన దేవేందర్ రాజు శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని దేవేందర్ రాజు ముదిరాజ్ తెలిపారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…