మనవార్తలు ,పటాన్ చెరు
సంక్రాంతి పండుగ ముగ్గులతో మహిళలోని సృజనాత్మకత బయటపడుతుందని టిఆర్ఎస్ పటాన్ చెరు నియోజకవర్గం నాయకులు, పటాన్ చెరు మాజీ సర్పంచ్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్ అన్నారు. నియోజకవర్గ టిఆర్ఎస్ మైనారిటీ విభాగం నాయకులు మేరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో పటాన్ చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన దేవేందర్ రాజు ముదిరాజ్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఇది మొదటి పండుగని, పాత ఆలోచనలకు స్వస్తి పలికి కొత్త ఆలోచనలతో కొత్త మార్గంలో పయనించాలని సూచించారు. దక్షిణాయనం నుండి ఉత్తరాయణం ప్రారంభం కానుండడంతో కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ అని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన దేవేందర్ రాజు శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని దేవేందర్ రాజు ముదిరాజ్ తెలిపారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…