వివాదాస్పదంగా మారిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ…
-తీవ్రస్థాయిలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం
– వాట్సాప్ కు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు
-పౌరుల హక్కులకు భంగం కలిగిస్తోందని వ్యాఖ్యలు
-వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు
హైదరాబాద్:
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ నూతన ప్రైవసీ విధానం కొంతకాలంగా వివాదాస్పదమవుతోంది. తన ప్రైవసీ పాలసీని యూజర్లు అంగీరించాల్సిందేనంటూ బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తోందని వాట్సాప్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ పై తీవ్రస్థాయిలో స్పందించింది. పౌరుల హక్కులకు భంగం కలిగించేలా వాట్సాప్ నూతన ప్రైవసీ విధానం ఉందని పేర్కొంది.
కొత్త విధానంలో వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు ముప్పు ఉందని అభిప్రాయపడింది. వాట్సాప్ తన కొత్త ప్రైవసీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సాప్ ఇండియా విభాగానికి నోటీసులు జారీ చేసింది. లేదంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. నూతన ప్రైవసీ విధానం వాయిదా వేసి తప్పించుకోవాలని చూడొద్దని హెచ్చరించింది.కేంద్రం నిర్ణయంతో వాట్సప్ తన నిర్యాన్ని ప్రకటించి యూజర్ల ప్రైవసీ కాపాడుతుందా? లేక తన పాలసీ ప్రకారం లేళ్లుతుందా అనేది చూడాలి .ప్రస్తుతానికి తమ ప్రైవసీ వాయిదా వేసుతున్నట్లు ప్రకటించి తప్పించుకోవాలని చుసిన వాట్సప్ పై కేంద్రం గట్టిగానే హెచ్చరికలు జారీచేసింది.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…