వివాదాస్పదంగా మారిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ…
-తీవ్రస్థాయిలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం
– వాట్సాప్ కు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు
-పౌరుల హక్కులకు భంగం కలిగిస్తోందని వ్యాఖ్యలు
-వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు
హైదరాబాద్:
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ నూతన ప్రైవసీ విధానం కొంతకాలంగా వివాదాస్పదమవుతోంది. తన ప్రైవసీ పాలసీని యూజర్లు అంగీరించాల్సిందేనంటూ బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తోందని వాట్సాప్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ పై తీవ్రస్థాయిలో స్పందించింది. పౌరుల హక్కులకు భంగం కలిగించేలా వాట్సాప్ నూతన ప్రైవసీ విధానం ఉందని పేర్కొంది.
కొత్త విధానంలో వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు ముప్పు ఉందని అభిప్రాయపడింది. వాట్సాప్ తన కొత్త ప్రైవసీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సాప్ ఇండియా విభాగానికి నోటీసులు జారీ చేసింది. లేదంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. నూతన ప్రైవసీ విధానం వాయిదా వేసి తప్పించుకోవాలని చూడొద్దని హెచ్చరించింది.కేంద్రం నిర్ణయంతో వాట్సప్ తన నిర్యాన్ని ప్రకటించి యూజర్ల ప్రైవసీ కాపాడుతుందా? లేక తన పాలసీ ప్రకారం లేళ్లుతుందా అనేది చూడాలి .ప్రస్తుతానికి తమ ప్రైవసీ వాయిదా వేసుతున్నట్లు ప్రకటించి తప్పించుకోవాలని చుసిన వాట్సప్ పై కేంద్రం గట్టిగానే హెచ్చరికలు జారీచేసింది.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…