పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ( ఎస్వోఏ ) హైదరాబాద్ – విశాఖపట్టణంలు సంయుక్తంగా ‘ ఆర్కిటెక్చర్లో విజయవంతమైన కెరీర్ ‘ అనే అంశంపై నవంబర్ 26 , 2022 న ( శనివారం ) మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 గంటల మధ్య వెబినార్ను నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ వెల్లడించారు . తాము ఈ ఏడాది వరుసగా నిర్వహిస్తున్న వెబినార్లలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . జహా హదీద్ ఆర్కిటెక్క చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ గణేష్ నిమ్మల ఈ వెబినార్లో ముఖ్య వక్తగా పాల్గొంటారని ఆయన తెలియజేశారు . ఆసక్తి ఉన్నవారు జూమ్ లింక్ http://surl.li/csbjt ద్వారా ఈ వెబినార్లో పాల్గొనవచ్చని , మీటింగ్ గుర్తింపు సంఖ్య : 588 858 3609 , పాస్వర్డ్ : GSoAHyd అని ఆయన వివరించారు . ఇతర వివరాల కోసం అసోసియేట్ ప్రొఫెసర్ కనక ఎన్.రావు ( 98666 19639 ) ను సంప్రదించవచ్చని , లేదా karerapu@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని సూచించారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…