పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మెదక్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ ను గెలిపించుకుంటామని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. . ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మెదక్ పార్లమెంట్ పరిధి నియోజకవర్గ రాజకీయాలపై చర్చించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో బీసీలు గెలిచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని , తమ శక్తి మొత్తాన్ని ఉపయోగించి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామన్నారు. మెదక్ జిల్లాలోని ప్రజా సంఘాలన్నిటిని ఏకం చేస్తామన్నారు. బీఆర్ఎస్, బిజెపిలు ఒకే భావజాలంతో పనిచేస్తున్నాయని, ఈ ఎన్నికలలో ఆయా పార్టీలను ఓడించేందుకు అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. మెతుకు సీమ నుంచి బరిలో నిలిచిన బీసీ బిడ్డ నీలం మధును గెలిపించుకుంటామని ప్రొఫెసర్ కోదండరాం దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ నేత హనుమంత రెడ్డి, టీజేఎస్ నేతలు నిజ్జన రమేష్, అంబటి శ్రీనివాస్, ధర్మార్జున్, బి. రమేష్, సర్దార్, వినోద్, ఆశప్ప, తుడుం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…