పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మేరు కులస్తులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని కులస్తులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు బీరంగూడ గుట్టపైన వివిధ కుల సంఘాలకు 1000 గజాల చొప్పున స్థలం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మేరు కులస్తులకు తగు ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. గతంలో టైలర్స్ అసోసియేషన్ సంఘానికి 450 గజాల స్థలాన్ని ఇంద్రేశంలో కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. ఇటీవల స్థలం విషయంలో టైలర్స్ అసోసియేషన్, మేరు సంఘాల మధ్య స్వల్ప వివాదం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. రెండు సంఘాలకు 225 గజాల కేటాయిస్తానని తెలిపారు. మేరు సంఘానికి భవిష్యత్తులో అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్, మేరు మండల కమిటీ. సలహాదారులు, మాజీ అధ్యక్షులు, యువజన సంఘం సభ్యులు, కులస్తులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…