Categories: politics

ప్రతి బస్తీ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం – జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా అభివృద్ధికి కృషి చేస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు.మియపూర్ డివిజన్ పరిధిలోని ఎం.ఏ నగర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి, బస్తి స్థానిక ప్రజలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటామని,స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని,శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి బస్తీలో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని విధాలుగా అందేలా చూస్తామని తెలిపారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఇళ్ల పట్టాలు ఇవ్వలేని యెడల సర్వె నంబర్ 100, 101లో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన లో భద్రత కల్పించాలని, మంజీర పైప్ లైన్ మరియు నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజ సమస్యలను జగదీశ్వర్ గౌడ్ దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు..ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కోర్దినేటర్ రఘునందన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇలియస్ షరీఫ్, వీరేందర్ గౌడ్, సంజీవ రెడ్డి, మన్నెపల్లి సాంబశివరావు, ప్రతాప్ రెడ్డి, నడిమింటి కృష్ణ, శంకర్ గౌడ్ ,ప్రభాకర్ గౌడ్ , తుడుము అనిల్ కుమార్, రాములు, యాదగిరి, రవికుమార్ గౌడ్, గిరి, అసిఫ్, సుమన్, సురేష్, రాంబాబు, నరేందర్ ముదిరాజ్, బాలు, నవీన్, ప్రవీణ్, కుమార్ యాదవ్, ,శ్రీకాంత్, సత్యరాజ్, ,రాఘవేంద్ర, నర్సింహ, నరేష్, హరీష్, మహిళలు ప్రియదర్శిని, అనిత, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago