politics

రామ-లక్ష్మణులుగా ఉంటాం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అందరం కలిసి సమిష్టిగా ముందుకెళితే, ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పటాన్చెరువు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి జన జాతర సభా సన్నాహక సమావేశం ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రామచంద్రపురం శ్రీ కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ గతంలో చోటు చేసుకున్న ఘటనలను మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ ఎమ్ ఆర్ కార్యకర్తలు కలిసి సహకరించాలని కోరారు . నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ తన అన్న లాంటివాడని ఇకపై తాము రామ,లక్ష్మణులవలె కలిసివుండి, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని ,ఇకపై పార్టీలో డబుల్ షూటర్లుగా పనిచేస్తామని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి, ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. ఇందుకు సహకరించిన కాంగ్రెస్ అధిష్టానానికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎదుటి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ముఖ్య నాయకులు కార్యకర్తలు పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన జాతర సభకు మెదక్ పార్లమెంటు పరిధి నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

లక్షన్నర మెజారిటీ తీసుకొస్తాం

కాటా శ్రీనివాస్ గౌడ్

ఇక ఇద్దరం కలిసాం మెదక్ ఎంపీ ఎన్నికల్లో పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లక్షన్నర ఓట్ల మెజారిటీ లక్ష్యంగా కృషి చేస్తానని ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి నీలం మధు అన్న గెలుపు కోసమే పాటుపడాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గతంలో జరిగిన ఘటనలను తాము ఎప్పుడో మరిచిపోయామని, కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ పార్లమెంట్ కు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చిన నీలం మధును గెలిపించుకోని, మిగతా పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే మెదక్ ఎంపీ అభ్యర్థికి కచ్చితంగా లక్షన్నర మెజార్టీ వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పటాన్చెరు పార్లమెంట్ ఇంచార్జ్ శ్యామ్ గౌడ్, నియోజకవర్గస్థాయి నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, మున్సిపాలిటీ ప్రెసిడెంట్లు, పట్టణ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

11 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago