_నియోజకవర్గ పరిధిలోని వంద మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
_ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టులది కీలకపాత్ర
_పటాన్చెరు నియోజకవర్గం జర్నలిస్టులు అదృష్టవంతులు
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారిదిగా పనిచేస్తూ, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎల్లప్పుడు పెద్దపీట వేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్నామని తెలిపారు.
గురువారం సాయంత్రం పటాన్చెరువు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో..పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలలో పనిచేస్తున్న 100 మంది జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి తోఎమ్మెల్యే జిఎంఆర్ ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. వీరితోపాటు కాజిపల్లి గ్రామానికి చెందిన 30 మంది రోడ్డు నిర్వాస బాధితులకు పట్టాలను అందచేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సోషల్ మీడియా మూలంగా మీడియా వార్త కథనాల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవికతను ప్రతిబింబించేలా కథనాలు ఉండాలని కోరారు. ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో లోటుపాట్లు ఉంటే వార్తల ద్వారా తెలియచేయాల్సిన గురుతర బాధ్యత మీడియాపై ఉందన్నారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 68 ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు.మొదటి విడతగా ప్రభుత్వ గుర్తింపు కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, రెండో విడతలో అర్హులై ఉండి అక్రిడేషన్ కార్డు లేని జర్నలిస్టులకు సైతం ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూములు అందజేస్తామని హామీ ఇచ్చారు.పటాన్చెరు నియోజకవర్గంలో పనిచేస్తున్న సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్నామని తెలిపారు. గత సంవత్సరం 60 లక్షల రూపాయల సొంత నిధులతో వందమంది జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందని గుర్తు చేశారు.. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి, లలిత సోమిరెడ్డి, రోజా బాల్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, కార్పొరేటర్లు పుష్ప నగేష్, మాజీ ఎంపీపీలు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, ఆయా మండలాల తహసిల్దార్లు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండలాల, డివిజన్ల అధ్యక్షులు అఫ్జల్, రాజేష్, షేక్ హుస్సేన్, దేవేందర్ యాదవ్, పాండు, అయ్యా గ్రామాల ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…