హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో కోటి వ్యాక్సిన డోసులు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రణాళిక బద్దంగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. హై రిస్క్ గ్రూప్స్ కి వాక్సిన్ ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని… దీంతో పాటు మొబైల్ వాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలు పెట్టామన్నారు .ఇప్పటికే రోజు 2లక్షలకు పైగా టీకాలు అందిస్తున్నామన్నారు. రోజుకు 7, 8లక్షల మందికి వాక్సిన్ అందించేస్థాయికి చేరుకున్నామన్నారు.
ఆరోగ్య శాఖ ఎంతో కష్టపడి వాక్సినేషన్ చేస్తోందని… ఆశ వర్కర్స్ నుంచి ప్రతి ఒక్కరికి సీఎస్ సోమేష్ కుమార్ ధన్యవాదాలు…వాక్సిన్ తీసుకున్న వారిలో ప్రమాద స్థాయి తక్కువగా ఉందన్నారు. టీచర్లకు కూడా ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము.
30 మొబైల్ వాక్సిన్ వెహికిల్స్ లో వాక్సినేషన్ కి సిద్ధంగా ఉన్నాయన్నారు . 18సంవత్సరాలు పైబడిన వారికి కూడా టీకా అందజేస్తున్నామన్నారు . వచ్చే నెలలో 2nd డోస్ వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు . ప్రజలందరూ తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవడం ద్వారా , వాక్సిన్ వేసుకోవడం ద్వారా కరోనా బారినుండి తప్పించుకోవచ్చన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…