Telangana

వెలిమల గ్రామంలో సర్ ఓటర్ అవగాహన సదస్సు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అర్హులైన ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడానికి, కొత్త ఓటర్ల నమోదును ప్రోత్సహించడానికి, తప్పులను సరిదిద్దడానికి అవగాహన సదస్సులు నిర్వహించ‌డం అభినంద‌నీయ‌మ‌ని తెల్లాపూర్ మున్సిపల్ వైస్ ఛైర్మ‌న్ రాములు గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని ముత్తంగి డివిజన్ ప‌రిధిలోని వెలిమ‌ల గ్రామంలో తాజా మాజీ కౌన్సిల‌ర్లు సుచ‌రిత‌,కొమ‌ర‌య్య‌, ప‌ట్లోళ్ళ ర‌వీంద‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఓట‌రు అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. అర్హులైన ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును న‌మోదు చేయించుకోవాల‌ని సర్ ప‌త్రాలు నింప‌డంలో అనుమానాలు ఉంటే హెల్ప్ డెస్క్ ల‌ను సంప్ర‌దించాల‌ని కోరారు. ఇప్ప‌టికే వెలిమ‌ల గ్రామంలో 80 శాతం ఓట‌ర్ల స‌ర్వే ప్ర‌క్రియ పూర్త‌యింద‌ని తెల్లాపూర్ మున్సిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ రాములు గౌడ్ తెలిపారు. అనంత‌రం ఇరువురు గ్రామ ప్రజలతో కలిసి సేకరించిన సమాచారాన్ని, సవరించిన ఓటర్ జాబితాలను బిఎల్ఓలకు అందించారు. వెలిమల గ్రామంలో సుమారు 3,000 ఓట్లు ఉండగా, ప్రజాప్రతినిధులు , అధికారులు సమన్వయంతో పనిచేసి ఇప్పటికే 80 శాతం ఓటర్ అవగాహన, సర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామ‌న్నారు . మిగిలిన ప్రక్రియను కూడా త్వరలోనే పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటామ‌న్నారు .ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రతీ ఒక్కరూ తమ ఓటును సరిచూసుకోవాల‌న్నారు .​ఈ కార్యక్రమంలో మంగలి దయాకర్, మున్నూరు రవి,ఎస్. ప్రభాకర్ రెడ్డి,కే. నవీన్,స్థానిక నాయకులు, బిఎల్ఓలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

16 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

17 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

17 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

21 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

21 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

21 hours ago