గోదావరి అంజిరెడ్డి సమక్షంలో బీజేపీలోకి చేరిన యువకులు, మహిళలు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
భారతీయ జనతా పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితులై స్వచ్చంధంగా పార్టీలో చేరడం సంతోషంగా ఉందని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని క్యాసారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మహిళలు, యువకులు పార్టీలో చేరారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సేవ, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్న బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు .బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన గోదావరి అంజిరెడ్డి క్యాసారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు . గ్రామ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు . ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి,రవీందర్ క్యాసారం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి, సుధాకర్, నర్సింహా గౌడ్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీ పురం 268 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…
మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు : గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…
పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…