ఎస్ఐఆర్ లో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత
ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం స్థానికంగానే ఓటరు నమోదు చేయించుకోండి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
మినీ ఇండియగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఇతర రాష్ట్రాల ఓటర్లు స్థానికంగానే తమ ఓటు వివరాలను నమోదు చేసుకుని పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో రాజస్థాన్, గుజరాత్, శ్రీకాకుళం, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రజలతోపాటు, వివిధ రంగాల వ్యాపారస్తులతో ఎస్ ఐ ఆర్ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై దిశ నిర్దేశం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 25 సంవత్సరాల తర్వాత ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపడుతోందాన్ని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు స్థానికంగా నివాసమే ఏర్పాటు చేసుకొని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని వారందరూ విధిగా స్థానికంగానే ఓటరు వివరాలు నమోదు చేసుకోవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రజలందరినీ సొంత బిడ్డల వలె చూసుకుంటున్నామని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేకంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియడానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉందని వివరాలు నమోదు చేయించుకొని వారందరూ తప్పనిసరిగా వివరాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మెట్టు కుమార్ యాదవ్, బాల్ రెడ్డి, విజయ్ కుమార్, బిక్షపతి, పృథ్వీరాజ్, వెంకటేష్, దామోదర్ రెడ్డి, తేజ, రాజు, రామ్మోహన్, వివిధ సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీ పురం 268 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…
మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు : గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…
పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…