Telangana

ప్రజానాయకుడు , ఈటెల రాజేందర్ కే ఓట్ వెయ్యండి – ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్

మనవార్తలు, శేరిలింగంపల్లి :

హుజూరాబాద్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రజా నాయకుడు ,ఉద్యమ కారుడు అయిన ఈటెల రాజేందర్ కె మీ ఆముల్యమైన ఓటువెయ్యాలని ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.ఒక్క ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తేనే ఇన్ని పథకాలు వచ్చినపుడు ,ఈటెల గెలిస్తే తెలంగాణ ఎన్నో ప్రజా పథకాలు కొట్లాడి తీసుకొస్తాడని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు హుజూరాబాద్ ప్రజల మీద ఆధారపడి ఉందని తెలిపారు.

ఉద్యమ కారులకు న్యాయం జరగాలంటే , కొట్లాడి సాధించుకున్న తెలంగాణ బానిస సంకెళ్ళ నుండి విముక్తి పొంది ,బంగారు తెలంగాణ కావాలంటే ఈటెల రాజేందర్ ను గెలవాలని కోరారు. యావత్ తెలంగాణ ప్రజలు ,సబ్బండ వర్గాలు ,కులాలకు అతీతంగా ,మతాలకు అతీతంగా ,పార్టీ లకు అతీతంగా కోరుకునేది ఒక్కటే ఈటెల ను గెలిపించాలని కోరారు.తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్న ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్ అని, అది హుజూరాబాద్ గడ్డ మీద పుట్టిన బిడ్డ మి బిడ్డ నీ గెలిపించండని ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు.

హుజూరాబాద్ ప్రజలు ప్రలోభాలకు లోంగకండి ,పైసలు ఎన్ని ఇచ్చిన తీసుకోండి ,ఈరోజు ఓటు కు 6 వేలు కాదు 10 వేలు. ఇచ్చినా అవి మన డబ్బులే , ఎవ్వరూ ఏమీ ఇచ్చినా తీసుకొని మీకు అందుబాటు లో ఉండే ఈటెల రాజేందర్ కమలం పువ్వు గుర్తుకు మి అమూల్యమైన ఓటు వేసి గెలిపించ గలరని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago