Telangana

ప్రజానాయకుడు , ఈటెల రాజేందర్ కే ఓట్ వెయ్యండి – ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్

మనవార్తలు, శేరిలింగంపల్లి :

హుజూరాబాద్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రజా నాయకుడు ,ఉద్యమ కారుడు అయిన ఈటెల రాజేందర్ కె మీ ఆముల్యమైన ఓటువెయ్యాలని ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.ఒక్క ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తేనే ఇన్ని పథకాలు వచ్చినపుడు ,ఈటెల గెలిస్తే తెలంగాణ ఎన్నో ప్రజా పథకాలు కొట్లాడి తీసుకొస్తాడని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు హుజూరాబాద్ ప్రజల మీద ఆధారపడి ఉందని తెలిపారు.

ఉద్యమ కారులకు న్యాయం జరగాలంటే , కొట్లాడి సాధించుకున్న తెలంగాణ బానిస సంకెళ్ళ నుండి విముక్తి పొంది ,బంగారు తెలంగాణ కావాలంటే ఈటెల రాజేందర్ ను గెలవాలని కోరారు. యావత్ తెలంగాణ ప్రజలు ,సబ్బండ వర్గాలు ,కులాలకు అతీతంగా ,మతాలకు అతీతంగా ,పార్టీ లకు అతీతంగా కోరుకునేది ఒక్కటే ఈటెల ను గెలిపించాలని కోరారు.తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్న ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్ అని, అది హుజూరాబాద్ గడ్డ మీద పుట్టిన బిడ్డ మి బిడ్డ నీ గెలిపించండని ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు.

హుజూరాబాద్ ప్రజలు ప్రలోభాలకు లోంగకండి ,పైసలు ఎన్ని ఇచ్చిన తీసుకోండి ,ఈరోజు ఓటు కు 6 వేలు కాదు 10 వేలు. ఇచ్చినా అవి మన డబ్బులే , ఎవ్వరూ ఏమీ ఇచ్చినా తీసుకొని మీకు అందుబాటు లో ఉండే ఈటెల రాజేందర్ కమలం పువ్వు గుర్తుకు మి అమూల్యమైన ఓటు వేసి గెలిపించ గలరని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago