Telangana

పట్టు వదలని విక్రమార్కుడు ఎమ్మెల్యే జిఎంఆర్

ఫలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి

మరికొద్ది రోజుల్లో పటాన్‌చెరు కేంద్రంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సేవలు

కార్యాలయం ఏర్పాటుకు హైకోర్టులో లైన్ క్లియర్  ప్రభుత్వానికి ఆదేశాలు జారీ

పటాన్‌చెరు కేంద్రంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం

అమీన్పూర్, రామచంద్రాపురం, పటాన్‌చెరు రెవెన్యూ మండలాల రిజిస్ట్రేషన్లు పటాన్‌చెరులోనే

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రయత్నాలు ఫలించాయి.పటాన్‌చెరు పట్టణ కేంద్రంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు హైకోర్టులో న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ ఇన్స్పెక్టర్ జనరల్ కు ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు.ఇదిలా ఉండగా 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్‌చెరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించగా 2023లో ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 30 జారీ చేశారు.

సబ్రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం సైతం పటాన్‌చెరులో ఏర్పాటు చేయాలని జీవోలో పేర్కొన్నారు. ఈ అంశంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జీవో నెంబర్ 30 అమలు పైన హైకోర్టు స్టే విధించింది. దీంతో పటాన్‌చెరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు బ్రేక్ పడింది.స్టే ఎత్తివేయాలని కోరుతూ పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృతంలో గత రెండు సంవత్సరాలుగా కొనసాగిన ప్రయత్నాలకు ఎట్టకేలకు ఫలితం లభించింది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనే డిఆర్ఓ కార్యాలయం కొనసాగించడంతోపాటు పటాన్‌చెరు కేంద్రంగా పటాన్‌చెరు రిజిస్ట్రార్ సబ్ కార్యాలయం సేవలు ప్రారంభించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని హైకోర్టుకు తెలిపారు. దీంతో పటాన్‌చెరు కేంద్రంగా సబ్ రిజిస్టార్ కార్యాలయం సేవల ప్రారంభానికి అడ్డంకులు తొలగిపోయాయి.

అతి త్వరలో కార్యాలయం ప్రారంభం

న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో అతి త్వరలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభించబోతున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. తాత్కాలికంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని పాత ఎమ్మార్వో కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. శాశ్వత భవన నిర్మాణం కోసం ఐదు ఎకరాలు కేటాయించాలని గతంలోనే ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని తెలిపారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago