– 500 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించదంలో శేరిలింగంపల్లి మండలం, అంజయ్య నగర్ లో గల విద్యా హై స్కూల్ విద్యార్థులు తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు.ఈ సంవత్సరం 40 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తిర్ణత సాధించడం తో పాటు 13 మంది విద్యార్థులు 600 కు గాను 500 కు పైగా మార్కులు సాధించి సత్తా చాటారు.మార్కెట్ లో పెరుగుతున్న పోటీని తట్టుకొని నిలబడి, కార్పొరేట్ స్కూల్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఫలితాలు సాధించి చూపారు. 40 మంది విద్యార్థులకు 40 మంది ఉత్తీర్ణత సాధించి, తామేమి తక్కువ కాదని నిరూపించారు. అంకిత భావం గల అధ్యాపక బృందం, ముందు చూపు, పట్టుదల గల కరస్పాండెంట్ త్రిమూర్తులు సార్ పర్యవేక్షణ లో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని విద్యార్థులు తెలుపగగా, విద్యార్థుల కృషి, ఏకాగ్రత, ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలనే విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయ బృందం అంకితభావం కూడా ఈ ఫలితాలు రావడానికి కారణం అయ్యాయని, అందరి కృషి వల్లే విజయం సాధ్యం అయిందని త్రిమూర్తులు తెలిపారు. ఇదే స్ఫూర్తి తో మరింత ఉత్సాహంగా పని చేస్తామని, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు, అందుకు సహకరించిన తల్లిదండ్రులకు, స్కూల్ అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…