Hyderabad

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…. – కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…

– భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

రామచంద్రపురం:

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని భారతినగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి పిలుపు నిచ్చారు.
రామచంద్రపురం జిహెచ్ఎంసిి కార్యాలయం లో డిప్యూటీ కమిషనర్ ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి  సమావేశానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి హాజరై ప్రసంగించారు.
సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పట్టణ ప్రగతితో పట్టణాన్ని మరింతగా అందంగా తీర్చిదిద్దుకునే అవకాశం కలిగిందన్నారు.కాలనీల వారీగా అధికారులను నియమించామన్నారు..

రేపటి నుండి పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించి బస్తిల్లలో,కాలనీలలో ఉన్న చెత్తను తొలగించడం,డ్రైనేజీ వ్యవస్థను శుభ్ర పరచడం, మురికి నీటి గుంతలను తొలిగించి పరిసరాలను పరిశుభ్రంగా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులను కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి కోరారు.

భారతీ నగర్ పరిధిలో ఏవైనా పరిష్కారం కాని సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారురోడ్లు ,డ్రైనేజీ, నాలాలు ఇతర సమస్యలు ఉంటే పట్టణ ప్రగతి కార్యక్రమంలో అప్పటికప్పుడే పరిష్కరిస్తామన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago