వరంగల్ ,మనవార్తలు ప్రతినిధి : తల్లిమరణిండంతో అండగా ఉన్న నాన్నమ్మకాలం చేయడంతో అనాథలుగా మిగిలిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయం చేశారు ఉద్యోగ, వ్యాపారవేత్తలు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కుక్కల రమ్య, సింధుల తల్లి సరిత మరణించగా.. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో ఇద్దర్ని నాన్నమ్మ కుక్కల ముచ్చాలు చేరదీసి సాకింది. గత 15 రోజుల క్రితం అనారోగ్యంతో ముచ్చాలు మరణించడంతో వారిద్దరు అనాథలుగా మిగిలారు. దీంతో వారి పరిస్థితిని చూసి చలించిపోయిన ఉద్యోగ, వ్యాపార వేత్తలు తలా ఒకచేతివేసి 60వేల రూపాయలను రమ్య, సింధులపేరుమీద పోస్టాఫీసులో ఫిక్స్ డిపాజిట్ చేశారు. గ్రామంలోని ఉద్యోగ, వ్యాపారుల సహకారంతో అక్కాచెల్లెళ్ల ఉన్నత చదువులకు సహాకరిస్తామన్నారు ఉపాధ్యాయుడు పులిదేవేందర్ ముదిరాజ్. పార్టీలకు అతీతంగా చిన్నారులకు సహాయం చేస్తామని సర్పంచ్ మాజీ సర్పంచ్ అందె వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో కలామ్స్ ఫౌండేషన్ కార్యదర్శి పరికి మధుకర్ తోపాటు పోస్ట్ ఆఫీసర్ కొన్ రెడ్డి సాంబరెడ్డి, వట్టే రవి కిరణ్, రాజనాల రాజు, దొనకొండ కర్ణాకర్ రెడ్డి, వట్టే శీను,మాడుగుల కుమారస్వామి,గుల్లపల్లి స్వామి, మెరుగు కుమారస్వామి,కటుకూరి రాజు, కుక్కల రాజాలు, కుమార్, అశోక్, కుక్కల మహేందర్,సాంబరాజు, కుక్కల రమేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…