వరంగల్ ,మనవార్తలు ప్రతినిధి : తల్లిమరణిండంతో అండగా ఉన్న నాన్నమ్మకాలం చేయడంతో అనాథలుగా మిగిలిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయం చేశారు ఉద్యోగ, వ్యాపారవేత్తలు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కుక్కల రమ్య, సింధుల తల్లి సరిత మరణించగా.. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో ఇద్దర్ని నాన్నమ్మ కుక్కల ముచ్చాలు చేరదీసి సాకింది. గత 15 రోజుల క్రితం అనారోగ్యంతో ముచ్చాలు మరణించడంతో వారిద్దరు అనాథలుగా మిగిలారు. దీంతో వారి పరిస్థితిని చూసి చలించిపోయిన ఉద్యోగ, వ్యాపార వేత్తలు తలా ఒకచేతివేసి 60వేల రూపాయలను రమ్య, సింధులపేరుమీద పోస్టాఫీసులో ఫిక్స్ డిపాజిట్ చేశారు. గ్రామంలోని ఉద్యోగ, వ్యాపారుల సహకారంతో అక్కాచెల్లెళ్ల ఉన్నత చదువులకు సహాకరిస్తామన్నారు ఉపాధ్యాయుడు పులిదేవేందర్ ముదిరాజ్. పార్టీలకు అతీతంగా చిన్నారులకు సహాయం చేస్తామని సర్పంచ్ మాజీ సర్పంచ్ అందె వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో కలామ్స్ ఫౌండేషన్ కార్యదర్శి పరికి మధుకర్ తోపాటు పోస్ట్ ఆఫీసర్ కొన్ రెడ్డి సాంబరెడ్డి, వట్టే రవి కిరణ్, రాజనాల రాజు, దొనకొండ కర్ణాకర్ రెడ్డి, వట్టే శీను,మాడుగుల కుమారస్వామి,గుల్లపల్లి స్వామి, మెరుగు కుమారస్వామి,కటుకూరి రాజు, కుక్కల రాజాలు, కుమార్, అశోక్, కుక్కల మహేందర్,సాంబరాజు, కుక్కల రమేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…