పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఔట్ రీచ్ లో భాగంగా, బాచుపల్లిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషన్ స్కూల్ విద్యార్థులకు ఆర్కిటెక్చర్ పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని బుధవారం గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో నిర్వహించారు. ముఖాముఖి, కొన్ని ప్రయోగాత్మక కార్యకలాపాలతో పాటు గీతం హైదరాబాద్ ప్రాంగణ సందర్శనను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఆర్కిటెక్చర్ రంగంలో విలువైన అంతర్దృష్టులను అందించం, వారిలో ఉత్సుకతను పెంపొందించడం లక్ష్యంగా దీనిని నిర్వహించారు.ఆర్కిటెక్చర్ అధ్యాపకులు అభిషేక్ కుమార్ సింగ్, స్నిగ్దా రాయ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యా అవగాహన, సృజనాత్మక స్ఫూర్తిని ప్రోత్సహించడానికి రూపొందించిన ఆకర్షణీయమైన కార్యకలాపాలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు. డిజైన్ సూత్రాలు, స్థిరమైన నిర్మాణ పద్ధతులు, కమ్యూనిటీలను రూపొందించడంలో ఆర్కిటెక్చర్ యొక్క సామాజిక పాత్రతో సహా వాస్తు విద్య, దాని అభ్యాసం యొక్క ముఖ్య అంశాలను వారికి వివరించారు.ఈ చొరవ విద్యార్థులకు వాస్తుశిల్పం పట్ల ఆసక్తిని రేకెత్తిచడమే గాక, సమాజం, పర్యావరణంపై నిర్మాణాల గణనీయమైన ప్రభావం గురించి స్పష్టమైన అవగాహనను కల్పించింది.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…