పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఔట్ రీచ్ లో భాగంగా, బాచుపల్లిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషన్ స్కూల్ విద్యార్థులకు ఆర్కిటెక్చర్ పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని బుధవారం గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో నిర్వహించారు. ముఖాముఖి, కొన్ని ప్రయోగాత్మక కార్యకలాపాలతో పాటు గీతం హైదరాబాద్ ప్రాంగణ సందర్శనను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఆర్కిటెక్చర్ రంగంలో విలువైన అంతర్దృష్టులను అందించం, వారిలో ఉత్సుకతను పెంపొందించడం లక్ష్యంగా దీనిని నిర్వహించారు.ఆర్కిటెక్చర్ అధ్యాపకులు అభిషేక్ కుమార్ సింగ్, స్నిగ్దా రాయ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యా అవగాహన, సృజనాత్మక స్ఫూర్తిని ప్రోత్సహించడానికి రూపొందించిన ఆకర్షణీయమైన కార్యకలాపాలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు. డిజైన్ సూత్రాలు, స్థిరమైన నిర్మాణ పద్ధతులు, కమ్యూనిటీలను రూపొందించడంలో ఆర్కిటెక్చర్ యొక్క సామాజిక పాత్రతో సహా వాస్తు విద్య, దాని అభ్యాసం యొక్క ముఖ్య అంశాలను వారికి వివరించారు.ఈ చొరవ విద్యార్థులకు వాస్తుశిల్పం పట్ల ఆసక్తిని రేకెత్తిచడమే గాక, సమాజం, పర్యావరణంపై నిర్మాణాల గణనీయమైన ప్రభావం గురించి స్పష్టమైన అవగాహనను కల్పించింది.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…