పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఔట్ రీచ్ లో భాగంగా, బాచుపల్లిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషన్ స్కూల్ విద్యార్థులకు ఆర్కిటెక్చర్ పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని బుధవారం గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో నిర్వహించారు. ముఖాముఖి, కొన్ని ప్రయోగాత్మక కార్యకలాపాలతో పాటు గీతం హైదరాబాద్ ప్రాంగణ సందర్శనను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఆర్కిటెక్చర్ రంగంలో విలువైన అంతర్దృష్టులను అందించం, వారిలో ఉత్సుకతను పెంపొందించడం లక్ష్యంగా దీనిని నిర్వహించారు.ఆర్కిటెక్చర్ అధ్యాపకులు అభిషేక్ కుమార్ సింగ్, స్నిగ్దా రాయ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యా అవగాహన, సృజనాత్మక స్ఫూర్తిని ప్రోత్సహించడానికి రూపొందించిన ఆకర్షణీయమైన కార్యకలాపాలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు. డిజైన్ సూత్రాలు, స్థిరమైన నిర్మాణ పద్ధతులు, కమ్యూనిటీలను రూపొందించడంలో ఆర్కిటెక్చర్ యొక్క సామాజిక పాత్రతో సహా వాస్తు విద్య, దాని అభ్యాసం యొక్క ముఖ్య అంశాలను వారికి వివరించారు.ఈ చొరవ విద్యార్థులకు వాస్తుశిల్పం పట్ల ఆసక్తిని రేకెత్తిచడమే గాక, సమాజం, పర్యావరణంపై నిర్మాణాల గణనీయమైన ప్రభావం గురించి స్పష్టమైన అవగాహనను కల్పించింది.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…