Hyderabad

ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ పై HRC లో గిరిజనుల ఫిర్యాదు..!

మనవార్తలు , అమీన్ పూర్

హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న ఠాకూర్ సింగ్ పై గిరిజ‌నులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. హ్యుమ‌న్ రైట్స్ క‌న్సుమ‌ర్ ప్రొటెక్ష‌న్ సెల్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ పేరుతో త‌న కారుకు బోర్డు త‌గిలించుకుని ద‌ర్జాగా బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడని లంబ‌డా విస్తావ‌త్ ర‌వి నాయ‌క్ ఫిర్యాదు చేశారు .సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలోని అయిలాపూర్ తాండలో పేద ప్ర‌జ‌లైన గిరిజ‌నుల‌ను హ్యుమ‌న్ రైట్స్ ట్ర‌స్ట్ పేరుతో భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్నాడని కమీషన్ కు ఫిర్యాదు చేశారు .

అయిలాపూర్ తాండలో గిరిజనుల భూములను ప్రభుత్వ భూములంటూ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ చైర్మన్ పేరుతో లేఖలు రాస్తూ బెదిరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో వివరించారు. గతంలో అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో డ్రోన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరించిన కేసు నమోదైనట్లు తెలిపారు. ఏకంగా మానవ హక్కుల కమీషన్ తనకు క్లిన్ చీట్ ఇచ్చిందని HRC నే తప్పుదోవబట్టించిన ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.

న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించినట్లు గిరిజనులు తెలిపారు. ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ పైన ఎంక్వైరీ వేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. హ్యూమన్ రైట్స్ పేరుతో బ్లాక్ మెయిల్స్ కు పాల్పడుతున్న వారిపైన పోలీసులు నిఘా పెట్టాలని తెలిపారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా హ్యూమన్ రైట్స్ కన్సుమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ చైర్మన్ ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ బాధితులంతా బయటికి రావాలని పిలుపునిచ్చారు.

Ramesh

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

2 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

2 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

3 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

3 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

3 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago