మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే ఆ ఉద్యోగానికి వన్నె తెచ్చిన వారవుతారని పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్
యేపూరి శివానందం పేర్కొన్నారు. పటాన్ చెరు మార్కెట్ యార్డ్ లో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న మహబూబ్ జోగిపేట్ మార్కెట్ యార్డ్ కు బదిలీపై వెళ్లారు. సోమవారం మార్కెట్ యార్డులో జరిగిన సన్మాన సభలో మార్కెట్ కమిటీ చైర్మన్ యేపూరి శివానందం తో పాటు యార్డ్ పాలకవర్గం సభ్యులు, వర్తకుల సంఘం ప్రతినిధులు,వర్తకులు పలువురు ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శివానందం మాట్లాడుతూ పటాన్ చెరు మార్కెట్ యార్డులో కార్యదర్శిగా మహబూబ్ ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. మార్కెట్ యార్డు అభివృద్ధికి చిరునామాగా పటాన్ చెరు మార్కెట్ యార్డు నిలిచిందని, రాబోయే రోజుల్లో మరింతగా యార్డు ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, పాలకవర్గం సభ్యులు వర్తకులు, దుకాణం దారులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…