Telangana

గీతంలో సాంకేతికత సాయంతో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధిపై శిక్షణ

గీతంలో సాంకేతికత సాయంతో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధిపై శిక్షణ

ప్రధాన శిక్షకులుగా పూణేలోని అడ్వెంట్ ఇన్ఫర్మేటిక్స్ శాస్త్రవేత్తలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో శుక్రవారం అధునాతన సాంకేతికత (మోల్ సాఫ్ట్) సాయంతో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధిపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ‘మాలిక్యులర్ డాకింగ్, వర్చువల్ స్క్రీనింగ్’ పేరిట శుక్రవారం నిర్వహించిన ఈ ఒకరోజు కార్యశాలలో ప్రధాన శిక్షకులుగా పూణేలోని అడ్వెంట్ ఇన్ఫర్మేటిక్స్ అప్లికేషన్ సైంటిస్టులు ఆదిత్య మిశ్రా, డాక్టర్ షంషైర్ సింగ్ సర్దార్ వ్యవహరించారు.కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీలో పాల్గొనే వారికి ఆచరణాత్మక నైపుణ్యాలను సమకూర్చడం లక్ష్యంగా నిర్వహించిన ఈ వర్క్ షాపులో ఔషధ ఆవిష్కరణ ప్రక్రియలను అనుకరించడానికి, క్రమబద్ధీకరించానికి ప్రముఖ మాలిక్యులర్ మోడలింగ్ సాఫ్ట్ వేర్ మోల్ సాఫ్ట్ వాడకంపై ప్రధానంగా దృష్టి సారించారు. మోల్ సాఫ్ట్ ఐసీఎం సాధనాల కార్యాచరణలపై లోతైన శిక్షణను అందించారు.

తద్వారా ఖర్చు తగ్గించడం, సులువుగా వినియోగించడం, ఔషధాభివృద్ధిలో మానవశక్తిని తగ్గించే విధానాలను వారు ప్రదర్శించారు. ఐసీఎం-ప్రో ఇంటర్ ఫేస్, ప్రత్యక్ష ప్రదర్శనల వంటివి ఇందులో పాల్గొన్న వారి అభ్యాస అనుభవాన్ని మరింత మెరుగుపరిచాయి.తొలుత, ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. శివకుమార్ అతిథులిద్దరినీ ఆహ్వానించి, సత్కరించారు. పరిశోధనలో అధునాతన కంప్యూటేషనల్ సాధనాలను వినియోగించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

పరిశోధనా నాణ్యత, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.డాక్టర్ ఎలగందుల సతీష్, డాక్టర్ విన్యాస్ మాయాస సమన్వయం చేసిన ఈ కార్యశాలలో అధ్యాపకులు, పరిశోధనా విద్యార్థులు దాదాపు 25 మంది చురుకుగా పాల్గొని ఆచరణాత్మక అనుభవంతో పాటు ప్రశంసా పత్రాలను కూడా పొందారు.ఈ చొరవ, ఔషధ శాస్త్రాల రంగంలో ఆవిష్కరణ, ఆచరణాత్మక అభ్యాసాన్ని పెంపొందించడంలో గీతం యొక్క నిబద్ధతను ప్రతిబింబించింది.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

6 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

6 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

6 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

6 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago