మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
బంజారాహిల్స్లోని బంజారా భవన్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో 2024-25 ఆస్థి పన్ను వసూలు రికార్డు స్థాయిలో వసూలైన సందర్బంగా జిహెచ్ఎంసి రెవెన్యూ విభాగానికి (30 సర్కిళ్లకు) సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా చందానగర్ సర్కిల్-21 నాలుగవ స్థానం వచ్చినందున చందానగర్ సర్కిల్ రెవెన్యూ విభాగన్ని సన్మానించారు.ఈ సందర్బంగా చందానగర్ సర్కిల్ ఉప కమీషనర్ పి. మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 109.54 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు తెలిపారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, టాక్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మొత్తం బృందం సమిష్టి కృషి వల్ల ఈ ఘనత సాధించగలిగామని తెలిపారు.
చందానగర్ రెవిన్యూ విభాగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమం లొ సర్కిల్ రెవెన్యూ విభాగం ఏఎంసీలు, టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.ఎర్లీ బర్డ్ స్కీం ద్వారా ఆస్తి పన్ను ఏప్రిల్ 30వ తేదీ లోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందే అవకాశం ఉందని, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎర్లీ బర్డ్ స్క్రీం అందుబాటులో ఉందని తెలిపారు. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్నుకు మాత్రమే ఎర్లీ బర్డ్ స్కీం వర్తింస్తుందని, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలపై ఎర్లీ బర్డ్ స్కీం వర్తించదని ఉప కమీషనర్ పేర్కొన్నారు.
శనివారం, ఆదివారం, సోమవారం మరియు ఏప్రిల్ నెలలోని అన్ని సెలవు రోజులలో బిల్ కలెక్టర్లు అందుబాటులో ఉంటారని, సర్కిల్ ఆఫీస్ సిటిజన్ సర్వీస్ సెంటర్ కూడా అందుబాటులో ఉంటుందని, ఫోన్ పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్, మీ సేవా సెంటర్ల లొ ఆస్థి పన్ను చెల్లిoచుకోవచ్చని, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చందానగర్ సర్కిల్ ప్రజలకు ఉప కమిషనర్ మోహన్ రెడ్డి కోరారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…