– కూతురి వైద్యం కోసం కార్మికుల ఆర్థిక చేయూత
యూనియన్ అధ్యక్షులు సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ కు 7,02,374 రూపాయల చెక్కు అందజేత
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఆపదలో ఉన్న కార్మికుని కుటుంబానికి తోటి కార్మికులు మేమున్నామంటూ తోడుగా నిలబడి అపన్న హస్తం అందించారు. వివరాల్లోకి వెళితే మండలంలోని రుద్రారం శివారులో గల తోషిబా పరిశ్రమ యూనిట్ 11లో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు కాప చిరంజీవి కూతురు జోసెలిన్ జాయ్(8) గత కొంతకాలంగా తలసేమియా వ్యాధితో బాధ పడుతుండడంతో నల్లగండ్ల లోని అమెరికన్ ఒంకాలజి ఇన్స్టిట్యూట్ లో చూపిస్తున్నారు. కాగా వైద్యులు చికిత్స ఖర్చులు చాలా వరకు అవుతాయని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కార్మికుని కుటుంబానికి తోషిబా యూనియన్( సిఐటియు)ఆధ్వర్యంలో కార్మికులంతా మేమున్నామంటు ముందుకు వచ్చి 7,02,374 లక్షల రూపాయలు పోగు చేశారు. చేసిన ఆ అమౌంటును శనివారం పరిశ్రమలో యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్, జనరల్ సెక్రటరీ అర్ అనంతరావు యూనియన్ నాయకుల సమక్షములో చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత కార్మికుడు చిరంజీవి మాట్లాడుతూ మా అమ్మాయి ఆపరేషన్ కోసం నాతోటి కార్మిక మిత్రులు ముందుకు వచ్చి ఇంత పెద్ద మొత్తం సహాయం అందించిన కార్మిక సంఘం నాయకులు, కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పి.శ్రీనివాసరెడ్డి,తిరుపతి,కే.శ్రీనివాసరెడ్డి,పి. శ్రీధర్,కే సత్యనారాయణ,కే శ్రీనివాస్, ఎల్ కృష్ణయ్య,శ్రీనివాసరెడ్డి,తోషిబా యూనిట్ల కు చెందిన యూనియన్ నాయకులు తదితరు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…