Telangana

కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ముత్తంగి డివిజన్ పరిధిలోని న్యూ టౌన్, డి ఎన్ కాలనీలలో పర్యటన

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

ఇటీవల జిహెచ్ఎంసిలో విలీనమైన ముత్తంగి డివిజన్ పరిధిలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం ముత్తంగి డివిజన్ పరిధిలోని డిఎన్ కాలనీ, న్యూటౌన్ కాలనీలలో ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రధానంగా కాలనీలు ఏర్పడినప్పుడు నిర్మించిన సిసి రోడ్లు, అంతర్గత మురికినీటి కాలువలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయని.. వెంటనే వాటిని ఆధునికరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా సీసీ రోడ్లు, యుజిడిల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని  వెంటనే నిధులు మంజూరు చేస్తామని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల జిహెచ్ఎంసిలో విలీనమైన ముత్తంగి పరిధిలోని ప్రతి కాలనీలో నూతన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఈఈ సురేష్, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నాయకులు సిల్వెరి శ్రీనివాస్, శ్రీనివాస్ గుప్తా, కుమార్ గౌడ్, మేరాజ్ ఖాన్, కిట్టు, సందీప్, రామకృష్ణ, అబేద్, యాదగిరి, బాబుల్ రెడ్డి, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago