Districts

గీతం పాలక మండలిలో చేరిన ముగ్గురు ప్రముఖులు…

– తపోవర్ధన్ , ఎమ్మార్కే ప్రసాద్ , రాజేంద్రప్రసాద్ ను స్వాగతించిన గీతం అధ్యక్షుడు

పటాన్ చెరు:

గీతం పాలక మండలి సభ్యులుగా మరో ముగ్గురు ప్రముఖులు చేరారు . ఆర్వీ ఎంటర్ప్రైజైస్ మేనేజింగ్ పార్టనర్ వాసిరెడ్డి తపోవర్ధన్ , ఎమ్వీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డెరైక్టర్ ఎమ్మార్కే ప్రసాదరావు , సీసీఎల్ ప్రోడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చెర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్లను పాలక మండలిలోకి గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ సాదరంగా స్వాగతించారు . గీతం తన లక్ష్యాలను సాధించడంలో వారి మార్గనిర్దేశనం ఉపకరించగలదని ఆయన ఆశాభావం . వెలిబుచ్చారు , వారి అనుభవం , దార్శనికత గీతను గొప్ప సంపదగా ఆయన అభిప్రాయపడ్డారు . ముగ్గురు ప్రముఖుల గురించి క్లుప్తంగా విశాఖలోని అనిల్ నీరుకొండ ఎడ్యుకేషనల్ సొసైటీ పూర్వ వ్యవస్థాపకుడు , కార్యదర్శిగా సేవలందించిన తపోవర్ధన్ ఓ ఉద్వేగభరితమైన విద్యావేత్త , రెండు దశాబ్దాలుగా అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం , నిర్వహణలతో పాటు దాతృత్వంలో కూడా పేరొందారు .

రహదారులు , వంతెనలు , భవన నిర్మాణంలో నాలుగు దశాబ్దాల విశేష అనుభవం గల ఎమ్మార్కే ప్రసాద్ , అయా ప్రభుత్వాలు తమ మౌలిక సదుపాయాల లక్ష్యాలను సాధించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు . బహుళ ప్రాజెక్టుల నిర్వహణ , వాటిని సకాలంలో పూర్తిచేయడంలో పేరొందారు . నియత్నాం , స్విట్జర్లాండ్ తో పాటు మనదేశంలో కూడా కర్మాగారాలున్న బహుళ జాతి కంపెనీకి నాయకత్వం వహిస్తున్న చల్లా రాజేంద్రప్రసాద్ , దాతృత్వంతోపాటు ఆధ్యాత్మికతలో కూడా తన నిబద్ధతను చాటుకున్నారు .

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

46 minutes ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

52 minutes ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago