– తపోవర్ధన్ , ఎమ్మార్కే ప్రసాద్ , రాజేంద్రప్రసాద్ ను స్వాగతించిన గీతం అధ్యక్షుడు
పటాన్ చెరు:
గీతం పాలక మండలి సభ్యులుగా మరో ముగ్గురు ప్రముఖులు చేరారు . ఆర్వీ ఎంటర్ప్రైజైస్ మేనేజింగ్ పార్టనర్ వాసిరెడ్డి తపోవర్ధన్ , ఎమ్వీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డెరైక్టర్ ఎమ్మార్కే ప్రసాదరావు , సీసీఎల్ ప్రోడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చెర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్లను పాలక మండలిలోకి గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ సాదరంగా స్వాగతించారు . గీతం తన లక్ష్యాలను సాధించడంలో వారి మార్గనిర్దేశనం ఉపకరించగలదని ఆయన ఆశాభావం . వెలిబుచ్చారు , వారి అనుభవం , దార్శనికత గీతను గొప్ప సంపదగా ఆయన అభిప్రాయపడ్డారు . ముగ్గురు ప్రముఖుల గురించి క్లుప్తంగా విశాఖలోని అనిల్ నీరుకొండ ఎడ్యుకేషనల్ సొసైటీ పూర్వ వ్యవస్థాపకుడు , కార్యదర్శిగా సేవలందించిన తపోవర్ధన్ ఓ ఉద్వేగభరితమైన విద్యావేత్త , రెండు దశాబ్దాలుగా అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం , నిర్వహణలతో పాటు దాతృత్వంలో కూడా పేరొందారు .
రహదారులు , వంతెనలు , భవన నిర్మాణంలో నాలుగు దశాబ్దాల విశేష అనుభవం గల ఎమ్మార్కే ప్రసాద్ , అయా ప్రభుత్వాలు తమ మౌలిక సదుపాయాల లక్ష్యాలను సాధించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు . బహుళ ప్రాజెక్టుల నిర్వహణ , వాటిని సకాలంలో పూర్తిచేయడంలో పేరొందారు . నియత్నాం , స్విట్జర్లాండ్ తో పాటు మనదేశంలో కూడా కర్మాగారాలున్న బహుళ జాతి కంపెనీకి నాయకత్వం వహిస్తున్న చల్లా రాజేంద్రప్రసాద్ , దాతృత్వంతోపాటు ఆధ్యాత్మికతలో కూడా తన నిబద్ధతను చాటుకున్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…