– తపోవర్ధన్ , ఎమ్మార్కే ప్రసాద్ , రాజేంద్రప్రసాద్ ను స్వాగతించిన గీతం అధ్యక్షుడు
పటాన్ చెరు:
గీతం పాలక మండలి సభ్యులుగా మరో ముగ్గురు ప్రముఖులు చేరారు . ఆర్వీ ఎంటర్ప్రైజైస్ మేనేజింగ్ పార్టనర్ వాసిరెడ్డి తపోవర్ధన్ , ఎమ్వీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డెరైక్టర్ ఎమ్మార్కే ప్రసాదరావు , సీసీఎల్ ప్రోడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చెర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్లను పాలక మండలిలోకి గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ సాదరంగా స్వాగతించారు . గీతం తన లక్ష్యాలను సాధించడంలో వారి మార్గనిర్దేశనం ఉపకరించగలదని ఆయన ఆశాభావం . వెలిబుచ్చారు , వారి అనుభవం , దార్శనికత గీతను గొప్ప సంపదగా ఆయన అభిప్రాయపడ్డారు . ముగ్గురు ప్రముఖుల గురించి క్లుప్తంగా విశాఖలోని అనిల్ నీరుకొండ ఎడ్యుకేషనల్ సొసైటీ పూర్వ వ్యవస్థాపకుడు , కార్యదర్శిగా సేవలందించిన తపోవర్ధన్ ఓ ఉద్వేగభరితమైన విద్యావేత్త , రెండు దశాబ్దాలుగా అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం , నిర్వహణలతో పాటు దాతృత్వంలో కూడా పేరొందారు .
రహదారులు , వంతెనలు , భవన నిర్మాణంలో నాలుగు దశాబ్దాల విశేష అనుభవం గల ఎమ్మార్కే ప్రసాద్ , అయా ప్రభుత్వాలు తమ మౌలిక సదుపాయాల లక్ష్యాలను సాధించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు . బహుళ ప్రాజెక్టుల నిర్వహణ , వాటిని సకాలంలో పూర్తిచేయడంలో పేరొందారు . నియత్నాం , స్విట్జర్లాండ్ తో పాటు మనదేశంలో కూడా కర్మాగారాలున్న బహుళ జాతి కంపెనీకి నాయకత్వం వహిస్తున్న చల్లా రాజేంద్రప్రసాద్ , దాతృత్వంతోపాటు ఆధ్యాత్మికతలో కూడా తన నిబద్ధతను చాటుకున్నారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…