Hyderabad

సెప్టెంబర్ 2వ తేదీన ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలి

పటాన్చెరు:

సెప్టెంబర్ 2వ తేదీన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా పండుగ నిర్వహించాలని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం పటాన్చెరు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన నియోజకవర్గస్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రెండో తేదీన నిర్వహించే జెండా పండుగ, పార్టీ సంస్థాగత నూతన కమిటీ లపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్య ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేయోభిలాషులు, ప్రతి ఒక్కరూ పాల్గొనేలా చూడాలని సూచించారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా మూలంగా పార్టీ జెండా పండుగ నిర్వహించలేక పోయామని, ఈ సంవత్సరం ఆనందోత్సాహాల మధ్య పండుగ వాతావరణంలో ప్రతి కార్యకర్త పాల్గొని కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు పార్టీ గ్రామ, మండల, డివిజన్, మున్సిపల్ నూతన కమిటీలను ఎన్నుకోవాలి ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన మహత్తర బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నుముక అన్నారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలం అని, కార్యకర్తలను కుటుంబ సభ్యుల వలె చూసుకునే ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీలు ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్ పి టి సి సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, సుప్రజా వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, పార్టీ గ్రామ, మండల, డివిజన్, మున్సిపాలిటీల అధ్యక్షులు అఫ్జల్, పాండు, తలారి రాములు, ఈర్ల రాజు, పరమేష్ యాదవ్, దేవేందర్ యాదవ్, రాజేష్, నరేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago