Telangana

సమాజంలో న్యాయవాది పాత్ర కీలకమైనదని..

– టీఎస్ లా సెట్ కన్వీనర్ ఓయూ, డీఎన్( ఫ్యాకల్టీ ఆఫ్ లా) విజయలక్ష్మి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సమాజంలో న్యాయవాది పాత్ర కీలకమైనదని టీఎస్లా సెట్ కన్వీనర్ ఓయూ, డీఎన్( ఫ్యాకల్టీ ఆఫ్ లా) విజయలక్ష్మి అన్నారు.పటాన్‌చెరు మండలం ముత్తంగి లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో విశ్వ భారతి న్యాయ కళాశాల మొదటి,రెండో సంవత్సర విద్యార్థులు ఫైనల్ఇయర్ విద్యార్థులకు ఇచ్చిన వీడ్కోలు సమావేశానికి లా సెట్ కన్వీనర్, ఓయూ డీఎన్ విజయలక్ష్మి, ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్, చైర్మన్ బీఓఎస్ రామ్ ప్రసాద్,విశ్వభారతి లా కళాశాల కరస్పాండెంట్ రవి అనంత లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల తో కలసి విశ్వభారతి లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భవాని జ్యోతి ప్రజ్వలన చేయించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి కరస్పాండెంట్ రవి అనంత తన తల్లి జ్ఞాపకంగా అనంత రాజమ్మ మెమోరియల్ పేరు మీద బంగారు పతకం అందించనున్నట్లు తెలిపారు.

అనంతరం టీఎస్ లా సెట్ కన్వీనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ. న్యాయం చేసే సమయంలో న్యాయవాది పాత్రను ఆమె వివరించారు. న్యాయ వృత్తి ద్వారా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. న్యాయవాది, న్యాయమూర్తి గానే కాకుండా ఏ రంగంలోనైనా దీంతో ఎదగవచ్చని ఆమె తెలిపారు. లా లో ఎంతమంది చేరాలనుకుంటే అంతమంది చేరవచ్చని దరఖాస్తులు ఇస్తున్నారని, అలాగా ఆన్ లైన్ విధానం ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. లాలో చేరితే సమాజానికి లాభం ఉంటుందని, మనం కొద్దో గొప్పో అందరికీ మేలు కలిగించిన వాళ్ళం అవుతామని ఆమె చెప్పారు. న్యాయవాద వృత్తి అంటేనే అట్లాంటిదని అన్నారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ రాంప్రసాద్ మాట్లాడుతూ.ముందుండి సహాయం చేసే అవకాశం అది ఒక్క లాయర్ కే ఉందన్నారు. అదేవిధంగా లా విద్యార్థులకు పలు సలహాలు,సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో విశ్వభారతి లా కలశాల అధ్యాపకులు గురుమూర్తి, వర్ష ,రమ్య, కీర్తి, అన్వి, పూనం, తేజశ్రీ, లా కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago