శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గల కొండాపూర్ డివిజన్ లోని రాజరాజేశ్వరి కాలనిలో సర్వేనెంబర్ 78 నుండి 93 లో ప్లాట్ నెంబర్ 350 లో ఒక వ్యక్తి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జి ప్లేస్ 5 అంతస్థుల భవనం నిర్మిస్తుండగా కాలని అసోసియేషన్ తరుపున అధ్యక్షుడు విజయ్ కృష్ణ గత నెలలో జి హెచ్ ఎం సి అధికారులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేయగా వారు నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటామని తెలిపి, కాలయాపన చేస్తున్నారని కాలని అధ్యక్షుడు విజయ్ కృష్ణ తెలిపాడు. సదరు అక్రమ నిర్మాదారున్ని ప్రశ్నించగా నేను ఎమ్మెల్యే మనీషిని, నాకు ఆయన సపోర్ట్ ఉందని, నా బిల్డింగ్ వద్దకు ఎవరు రావద్దని ఎమ్మెల్యే చెప్పారని పేర్కొంటున్నాడని, ఇలా అయితే కాలని మొత్తం అక్రమ నిర్మాణాలే ఉంటాయని, నేనేమి అతీతున్ని కాను అంటూనే ఎమ్మెల్యే పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 20 వ తేదీ నాడు అధికారులకు పిర్యాదు చేయగా, సదరు అక్రమ నిర్మాణదారునికి అదేరోజు నోటీసులు జారీ చేసినట్లు తెలిపి అనంతరం కంప్యూటర్ లో నుండి అధికారులు ఆ విషయాన్ని తొలిగించారని కాలని అధ్యక్షుడు ఆరోపించారు. ఇట్టి విషయంలో అధికారుల కాలయాపన, ఎమ్మెల్యే పేరు వాడుకున్నందుకు ఎమ్మెల్యే ను కూడా కలుస్తామని తెలిపాడు.ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తామని కాలని వాసులు హెచ్చరించారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మనవార్తలు ప్రతినిధి ,…
ఎస్ టిపి ప్లాంటు ఏర్పాటును విరమించుకోవాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, కలెక్టర్ కు వినతి మనవార్తలు ప్రతినిధి…
ఆనందంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆరోగ్యం, శ్రేయస్సుకు యోగాను ఒక సంపూర్ణ…
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఖాతాలో మరో అవార్డు దక్కింది .…