Telangana

అక్రమ నిర్మాణo చర్యలు తీసుకోవాలని కాలని అధ్యక్షుడు పిర్యాదు

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : 

శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గల కొండాపూర్ డివిజన్ లోని రాజరాజేశ్వరి కాలనిలో సర్వేనెంబర్ 78 నుండి 93 లో ప్లాట్ నెంబర్ 350 లో ఒక వ్యక్తి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జి ప్లేస్ 5 అంతస్థుల భవనం నిర్మిస్తుండగా కాలని అసోసియేషన్ తరుపున అధ్యక్షుడు విజయ్ కృష్ణ గత నెలలో జి హెచ్ ఎం సి అధికారులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేయగా వారు నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటామని తెలిపి, కాలయాపన చేస్తున్నారని కాలని అధ్యక్షుడు విజయ్ కృష్ణ తెలిపాడు. సదరు అక్రమ నిర్మాదారున్ని ప్రశ్నించగా నేను ఎమ్మెల్యే మనీషిని, నాకు ఆయన సపోర్ట్ ఉందని, నా బిల్డింగ్ వద్దకు ఎవరు రావద్దని ఎమ్మెల్యే చెప్పారని పేర్కొంటున్నాడని, ఇలా అయితే కాలని మొత్తం అక్రమ నిర్మాణాలే ఉంటాయని, నేనేమి అతీతున్ని కాను అంటూనే ఎమ్మెల్యే పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 20 వ తేదీ నాడు అధికారులకు పిర్యాదు చేయగా, సదరు అక్రమ నిర్మాణదారునికి అదేరోజు నోటీసులు జారీ చేసినట్లు తెలిపి అనంతరం కంప్యూటర్ లో నుండి అధికారులు ఆ విషయాన్ని తొలిగించారని కాలని అధ్యక్షుడు ఆరోపించారు. ఇట్టి విషయంలో అధికారుల కాలయాపన, ఎమ్మెల్యే పేరు వాడుకున్నందుకు ఎమ్మెల్యే ను కూడా కలుస్తామని తెలిపాడు.ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తామని కాలని వాసులు హెచ్చరించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago